కేయూ ఇంజనీరింగ్ మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

కేయూ క్యాంపస్, నేటిదాత్రి
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న మూడవ సంవత్సరం మొదటి సెమిస్టర్ ఇంజనీరింగ్ మిగతా పరీక్షలను నిరవధికంగా వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి మల్లా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 9, 12, 14, 16 వ తేదీల్లో జరగాల్సిన మిగతా ఇంజనీరింగ్ పరీక్షలను వాయిదా వేసినట్లు వారు పేర్కొన్నారు. పరీక్షలు మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని, షెడ్యూల్ను వెబ్సైట్లో ఉంచుతామని తెలిపారు. హాస్టల్లో ఉండే వసతి తీసుకుంటున్న విద్యార్థులలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య అధికారుల నేతృత్వంలో అధికారులు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు సోమవారం నుంచి జరగాల్సిన మిగతా పరీక్షలు సైతం వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *