అన్నదానాలు ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు

కన్యకపరమేశ్వరి ఆలయంలో కనకాభిషేకానికి హాజరు

ఖమ్మం, అక్టోబర్, 2:

ఖమ్మం నగరంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం

పలు చోట్ల నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలకు రాజ్యసభ ఎంపీ

వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. 48వ డివిజన్ తో పాటు గుట్టల బజార్ లోని వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయంలో అన్నదానాలను ఆయన ప్రారంభించారు. తొలుత 

ఎఫ్ సీ ఐ గోదాంల సమీపాన గల వెంకటేశ్వర నగర్ లో స్థానిక కార్పోరేటర్ తోట గోవిందమ్మ, టీఆర్ఎస్ నాయకులు తోట రామారావు, తోట రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎంపీ రవిచంద్ర స్థానిక ప్రజలకు అన్నం వడ్డించారు. అనంతరం వాసవీ

కన్యకపరమేశ్వరి ఆలయంలో జరుగుతున్న నవరాత్రి పూజలకు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కనకాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రముఖులు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, చెరుకూరి

కృష్ణమూర్తి, చిన్ని కృష్ణారావు, కొప్పు నరేష్ కుమార్, రెసోనెన్స్ శ్రీధర్ తదితరులు ఎంపీ రవిచంద్రను ఘనంగా స్వాగతించి, సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు ఇనుగుర్తి వెంకటేశ్వర్లు, స్వర్ణకారుల సంఘం నాయకులు పరబ్రహ్మం, చిదంబరచారి, దుర్గాప్రసాద్, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *