> హ్యూమన్ రైట్స్ జిల్లా వైస్ చైర్మన్ గా కొంగళ్ళ కృష్ణయ్య.

జిల్లా చైర్మన్ గా కాశపోగు జాన్.

సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై దృష్టి పెట్టాలి.

మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి

 

హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఛైర్మన్ కాశపోగు జాన్ చేతులు మీదుగా ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ గా కొంగళ్ళ కృష్ణయ్య కు, ప్రధాన కార్యదర్శి గా జగత్ ప్రకాష్ కు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా చైర్మన్ కాశపోగు జాన్ మాట్లాడుతూ
హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చూపేందుకు తమ వంతు కృషి చేయాలని సూచించారు.సమాజంలో సామాౠ ప్రజలపై జరుగుతున్న అన్యాయం,అసమానతలు , సామాజిక,ఆర్థిక,రాజకీయ అంశాలపై దృష్టి సారించాలి అని అన్నారు. పేదరికాన్ని తగ్గించే మార్గాలు చూడాలని తెలిపారు. నూతనంగా ఎన్నికైనందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు.ఆయన హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా గుర్తింపు కార్డులను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!