సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి

పుట్టినరోజు సందర్భంగా యువతకు, అనుచరులకు సందేశం : హమీద్ షేక్ 

మిర్యాలగూడ, నేటి ధాత్రి:తన పుట్టినరోజు (జూన్ 14) సందర్భంగా యువత, అభిమానులు, అనుచరులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా అపన్నులను ఆదుకోవడం, నిరాశ్రయులకు సాయం అందించడం, నిరుపేదలకు చేయూతను ఇవ్వాలని, విద్యార్థులకు తమ శక్తి మేర నోట్ బుక్స్, పెన్నులు, స్టేషనరీ అందజేయాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారందరికీ తన వంతు సహకారం, మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పునరుద్ఘాటించారు. యువతలో ప్రేరణ నింపేందుకు ప్రయత్నిస్తున్నన్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించిన వారు తమ ఫొటోను షేర్ చేయాల్సిండిందిగా హమీద్ షేక్ అభ్యర్ధించారు. తనకు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తూ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు, బంధుమిత్రులకు, అనుచరులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!