వైద్య హబ్బుగా స్టేషన్ డాక్టర్ ఎమ్మెల్యే రాజయ్య

ఆసుపత్రికి ఐదు ఎకరాల స్థలం అతి త్వరలో గుర్తిస్తాం

హరీష్ రావును పిలిపించుకొని శంకుస్థాపన చేయించుకుందాం

అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది స్టేషన్గన్పూర్

స్టేషన్ ఘనపూర్: జనగాం నేటి ధాత్రి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రాష్ట్ర ఉపాధ్యాయ శాఖ మంత్రి హరీష్ రావు స్టేషన్ ఘనపూర్ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి శాంక్షన్ ఇవ్వడం పట్ల కృతజ్ఞత సమావేశం స్టాండింగ్ కమిటీ చైర్మన్ జడ్పిటిసి మారపాక రవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా
ఎమ్మెల్యే హజరై సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ స్టేషన్గన్పూర్ రిజర్వేర్ల విద్య హబ్బు గా మారిందని ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి రావడంతో వైద్య అబుగా కూడా స్టేషన్గన్పూర్ మొదటి స్థానంలో ఉందన్నారు
గత నాలుగు సంవత్సరాల క్రితం స్టేషన్ ఘనపూర్ ఉన్న పరిస్థితి పేరు ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరని అన్ని రంగాలలో అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉందన్నారు నియోజకవర్గంలోని జఫర్గడ్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిగా నిర్మించుకోవడం సంతోషదాయకమన్నారు ఏది ఏమైనా రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు నియోజకవర్గానికి సంక్షేమ అభివృద్ధి పనులు కోరిన వెంటనే సాంక్షన్ ఇచ్చారని వారన్నారు.

వంద పడకల ఆసుపత్రి నిర్మించడానికి హైవే అనుకుని దగ్గరలో ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించి రాష్ట్ర మంత్రి హరీష్ రావు దృష్టి తీసుకు వెళ్తామని అతి త్వరలోనే శంకుస్థాపన చేయించుకుని పనులు ప్రారంభిస్తామన్నారు.

డాక్టర్ సుగుణాకర్ రాజ్

(ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్)

మాట్లాడుతూ
అతి తక్కువ సమయంలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు.
వంద పడకల ఆసుపత్రి నిర్మీంచుకోవాలంటే మనకు కావాల్సింది 5 ఎకరాలు భూమి కావాలి అది త్వరగా గుర్తించి ఏర్పాటు చేసుకుంటే శంకుస్థాపన చేసుకుంటే బాగుంటుందని వారన్నారు. ప్రమాదంలో ఏమన్నా జరిగి గాయాలైతే క్షతగాత్రులకు అత్యవసర చికిత్స చేసుకోవాలంటే కార్పొరేటర్ ఆసుపత్రులలో వైద్యం చేసుకుని లేదని ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్ కు వంద పడకలాసుపత్రి రావడం సంతోషమన్నారు.

అభివృద్ధి చెందిన రెవిన్యూ డివిజన్లో ఏర్పడినటువంటి హాస్పిటల్లో అన్ని రకాల సేవలు అవకాశం ఉందని ఇందులో 26 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారని, పోస్టుమార్టం సౌకర్యం కావాలి ప్రమాదాలు జరిగితే కేసు కానీ అన్ని రకాల వైద్య సేవలు ఎప్పుడైతే ఇప్పుడు
54 పరీక్షలు ఏది ఉంటే ఇప్పుడు 134 రకాల రక్త పరీక్షలు చేసుకుని అవకాశం ఉంది అందరు వినియోగించుకోవాలని సూచించారు. రేడియోలజీ కేంద్రంలో మరి నాలుగున్నర కోట్ల రూపాయలతో అత్యంత అధునాతనమైనటువంటి వైద్య పరికరాలు
అందుబాటులో ఉన్నాయని అన్నారు
యశోద హాస్పిటల్ కంటే నాణ్యమైనటువంటి డయాగ్నొస్టిక్ ఎక్విప్మెంట్ మన ప్రభుత్వం సమకూర్చింది కాబట్టి మీరు మాస్టర్ చెకప్ కోసం డబ్బులు వృధా చేసుకోకుండా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య తెలంగాణలో పాలు పంచుకుని అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ మార్కెట్ చైర్మన్ గుజరి రాజు ఆకుల కుమార్ మనోజ్ రెడ్డి చిల్పూర్ గుట్ట చైర్మన్ శ్రీధర్ రావు ఎంపీపీ రేఖ గట్టయ్య వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి స్థానిక సర్పంచ్ తాటికొండ సురేష్ వైద్యాధికారులు పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!