గ్రేట్ వన్ కాంట్రాక్టర్ తో కుమ్మక్కైన సివిల్ సప్లై అధికారులు!.? బియ్యం కోతపై ప్రశ్నిస్తే డీలర్ల పై దాడులు.!?
రేషన్ బియ్యం సరఫరాలో అనేక అవకతవకలు వెలుగులో.!? బస్తా కేవలం 45 కిలోలే. 26 కింటల్ కోత.
ఎంఎల్ఎస్ కేంద్రం దండి కొట్టిన రేషన్ బియ్యం ప్రతి నెల ఎలెడ!? పేరుకు కిలో కిలోన్నర బియ్యం ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేసి వందల టన్నులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న కాంట్రాక్టర్ సివిల్ సప్లై అధికారులు.!?
మహాదేవపూర్- నేటి ధాత్రి:
ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యం పై పెద్దగా శ్రద్ధ చూపెట్టకపోవడం పాఠశాల మరియు వసతి గృహాల్లో మాత్రమే సన్నబియ్యం ప్రభుత్వం ఉచితంగా అందించడం రేషన్ బియ్యం కదా అనుకొని పెద్దగా ఇటు ప్రజలు అధికారులు పట్టించుకోకపోవడం రేషన్ బియ్యం సరఫరాలో లక్షల రూపాయల రేషన్ బియ్యం సివిల్ సప్లై అధికారులు అలాగే గ్రేట్ వన్ కాంట్రాక్టర్ల కుమ్మక్కుతో పక్కదారి పట్టడం అన్న విషయం నేటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు తెలియదు. ఉచితంగా సరఫరా చేసే రేషన్ బియ్యం సామాన్య పేద ప్రజలతో పాటు అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ దళిత గిరిజనుల లాంటి వారికి ఒక వరం అని చెప్పవచ్చు. కానీ పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని ఖరీదు చేసి రాష్ట్ర ప్రజలకు ఉచితంగా అందించడం జరుగుతున్న క్రమంలో రేషన్ బియ్యం పై అలాగే సన్న బియ్యం కు సంబంధించి సివిల్ సప్లై శాఖ అలాగే రేషన్ డీలర్లకు ప్రజానికం సరఫరాలో కలిగిన ఇబ్బందులకు సంబంధించి అడిగే పరిస్థితి ఉండదు దీనికి అలుసుగా తీసుకున్న సివిల్ సప్లై శాఖ ప్రజానికం పట్టించుకోరు అనే బలమైన నమ్మకంతో రేషన్ బియ్యం సరఫరా లో అంతులేని అక్రమాలకు దారితీస్తూ ఇటు ప్రశ్నించే డీలర్లపై ఒత్తిడికి గురి చేస్తూ వందల కింటల్ ల బియ్యాన్ని పక్క దారి పట్టిస్తున్నారన్న విషయం నేడు సాక్షాలతో తెర పైకి రావడం జరిగింది.
రేషన్ బియ్యం సర్ ఫరా లో కాంట్రక్టర్ ల ఆగడాలు.!?
మహదేవ్పూర్ ఎంఎల్ఎస్ కేంద్రంగా ఐదు మండలాలకు రవాణా చేస్తున్న రేషన్ మరియు సన్న బియ్యం అక్రమాల వ్యవహారంలో పెద్ద మొత్తంలో గండి కొడుతూ తమకేమీ సంబంధం లేనట్టుగా గ్రేట్ వన్ కాంట్రాక్టర్ సివిల్ సప్లై అధికారులతో కుమ్మక్కై కేవలం తాము బియ్యం సంచులను రవాణా చేస్తున్నామని చెపుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా సి డబ్ల్యూ సి గోదాం నుండి తాము మహాదేవపూర్ ఎమ్మెల్యే పాయింట్ వరకు కేవలం కాగితాల పరంగా ఉన్న బియ్యం సంచులను మాత్రమే రవాణా చేయడం తమ బాధ్యత అని సంచుల్లో ఉన్న కోత విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని అలాగే తమకు సంబంధం కూడా లేదని చెప్తున్నట్లు తెలుస్తుంది. సి డబ్ల్యు సి గోదాం నుండి నేరుగా గ్రేట్ వన్ కాంట్రాక్టర్ ప్రతి లారీకి 600 బస్తాల చొప్పున మహదేవ్పూర్ ఎమ్మెల్యే కేంద్రానికి తరలించడం జరుగుతుంది. కేవలం గ్రేట్ వన్ కాంట్రాక్టర్ లారీ డిస్పాచ్ సివిల్ సప్లై శాఖ అందించిన డిస్పాచ్ లెటర్ అందించి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ 600 బస్తాల్లోని లారీ బస్తాల్లో ఉన్నటువంటి క్వాంటిటీ కేవలం కాగితంపైనే 29.7 52 నుండి మొదలుకొని 29.972 వరకు మాత్రమే క్వాంటిటీ ఉందని సివిల్ సప్లై శాఖ అందించిన డిస్పాచ్ లెటర్ పైన అంతా ఆధారపడి ఉంటుంది. కానీ లారీలో ఉన్న 600 బస్తాల్లో వాస్తవానికి 29 కింటల్లా బియ్యం ఉందా అంటే దానికి సమాధానం ఉండదు ఎందుకంటే ఒక లారీకి సుమారు మూడు నుండి నాలుగు నుండి ఆరు కింటలు సుమారు 12 బస్తాల వరకు తక్కువ క్వాంటిటీ బియ్యం ఉంటుంది కానీ గ్రేడ్ వన్ కాంట్రాక్టర్ మాత్రం ఎప్పుడు లారీలో ఉన్న 600 బస్తాలకు వే బిడ్జి తూకం వేయించి 600 బస్తాకు వాటిలో ఉన్న నిలువ బియ్యం యొక్క క్వాంటిటీ వివరాలు ఇప్పటికీ సమర్పించిన చరిత్ర లేదు. ఒకవేళ గ్రేట్ వన్ కాంట్రాక్టర్ అలా చేస్తే కేవలం 24 నుండి 26 క్వింటాళ్ల వరకే లారీలో ఉన్న బియ్యం తూకం వస్తుందన్న విషయం కాంట్రాక్టర్ కు తెలుసు కేవలం బస్తాలతోనే అన్లోడింగ్ చేసి వెళ్లిపోవడం జరుగుతుంది. బస్తాల్లో ఉన్న బియ్యం యొక్క నిలువ వాటి వాస్తవికత వివరాలు అంతా గ్రేడ్ వన్ కాంట్రాక్టర్ తో పాటు సివిల్ సప్లై అధికారులు ఎం ఎల్ ఎస్ కేంద్ర నిర్వాహకునికి తెలిసి ఉన్నప్పటికీ నేటికీ తమకు సంచుల్లో పెద్ద మొత్తంలో బియ్యం తక్కువ వస్తున్నాయన్న విషయం అధికారులకు చెప్పిన దాఖలాలు లేవు ఎందుకంటే తూకం పేరుతో వందల టన్నుల రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్నారని విషయం బహిర్గతం కాకుండా ఉండుటకు అందరూ నిశ్శబ్దాన్ని పాటిస్తూ నేటికీ కొనసాగించడం విశేషం.
గ్రేట్ వన్ కాంట్రాక్టర్ తో కుమ్మక్కైన సివిల్ సప్లై అధికారులు!.? బియ్యం కోతపై ప్రశ్నిస్తే డీలర్ల పై దాడులు.!?
ఇక మహాదేవపూర్ మండలంతో పాటు మిగతా 5 మండలాలకు సంబంధించి రేషన్ బియ్యం సరఫరాతో పాటు సన్న బియ్యం సరఫరా విషయంలో పెద్ద మొత్తంలో ఆవు కథ వ్యవహారం పై సివిల్ సప్లై అధికారులు గ్రేడ్ వన్ కాంట్రాక్టర్ తో కుమ్మక్కై కుట్టు చప్పుడు కాకుండా రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్నారని విషయం దానికి సంబంధించిన వాస్తవాలు తెర పైకి రావడం నేడు సంచలనంగా మారిన పరిస్థితి. మరోవైపు కాంట్రాక్టర్ మరియు సివిల్ సప్లై కుమ్మక్కై ఈ వ్యవహారం నడిపిస్తున్నారు అన్నదానికి ఒక ప్రధాన సాక్షాలు ఒకటి రెండు కాదు మండలం తో పాటు ఐదు మండలాలకు సంబంధించిన రేషన్ డీలర్లు ఇతర పాఠశాలల బాధ్యులు గిరిజన కేంద్రాల నిర్వహకులే సాక్షాలు నేటికీ రేషన్ డీలర్ల పరిస్థితి ఒకవేళ తమకు తీసుకున్న అలాట్మెంట్లో కింటల్ నర నుండి 2:30 కింతల వరకు బియ్యం తక్కువ వచ్చిందని చెప్పే పరిస్థితి ఉండదు ఒకవేళ చెప్తే రెండవ రోజు సివిల్ సప్లై అధికారులు రేషన్ షాపుపై తనిఖీల పేరుతో 6a కేసును నమోదు చేసి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని అందుకు అనేక సంవత్సరాల నుండి తాము సొంత డబ్బులను వెచ్చించి ప్రజలకు రేషన్ బియ్యం అందించే పరిస్థితి ఉందని చెప్పుకోవడం విశేషం. కాంట్రాక్టర్ సివిల్ సప్లై అధికారుల రేషన్ బియ్యం సరఫరా అవినీతి కి పాల్పడుతున్నారన్నదానికి మరో సాక్ష్యం ఈనెల అందించిన రేషన్ బియ్యం కు సంబంధించి ఒక కేంద్రంలో రేషన్ బియ్యం సంచిని తూకం వేయగా అది కేవలం 45 కిలోలు మాత్రమే ఉంది. ఇలా సుమారు మహదేవ్పూర్ మండలం లోని రేషన్ షాపులకు సంబంధించి ప్రతి షాపులో కేవలం 45 నుండి 46 కిలోల వరకు మాత్రమే 50 కిలోల సంచిలో బియ్యం ఉండడం విశేషం.
రేషన్ బియ్యం సరఫరాలో అనేక అవకతవకలు వెలుగులో.!? బస్తా కేవలం 45 కిలోలే. 26 కింటల్ కోత.
రేషన్ బియ్యం సరఫరాలో పెద్ద మొత్తంలో పూకం లేకుండా బస్తాల పేరుతో చేపడుతున్నటువంటి అవకతవకల వ్యవహారం సాధారణంగా కిలో అర కిలో అని చూసి చూడనట్టుగా వ్యవహరించే సందర్భాన్ని వదిలేసి పెద్ద మొత్తంలో జరుగుతున్నటువంటి భారీ రేషన్ బియ్యం అక్రమాలని వెలుగులోకి రావడం జరిగింది. సిడబ్ల్యుసి కేంద్రం నుండి వచ్చే ప్రతి బస్తా కేవలం సివిల్ సప్లై అధికారులు ఇచ్చే రసీదులోనే మాత్రం 5080 గ్రాముల బస్తా వేటును తీసివేస్తూ ఒక లారీలో 29 క్వింటాళ్ల 970 తోపాటు ఇతర అంకెలను కాగితాలకు పరిమితం చేస్తూ అందించడం జరుగుతుంది. కానీ మహదేవ్పూర్ మండలంలో ఎంఎల్ఎస్ కేంద్రంగా సరఫరా చేసి రీసన్ బియ్యంతో పాటు సన్న బియ్యం పెద్ద మొత్తంలో అవకతవకల వ్యవహారం సాక్షాలతో తిరుపతికి రావడం కేవలం ప్రతి బస్తా నలభై ఐదు కిలోల నుండి 46,30 మాత్రమే బస్తాలు బియ్యం ఉండడం ఒక లారీలోని 600 బస్తాలకు 49 కిలోల బస్తాలు కేవలం వీళ్ళపై లెక్కబెట్టొచ్చని మిగతా అంతా బస్తాలు కూడా 45 46 కిలోలు మాత్రమే ఉండడం జరుగుతుంది. విచిత్రం ఏమిటంటే బియ్యం తీసుకునే డీలర్లకు కేవలం కాగితం పై ఉన్నటువంటి అలాట్మెంట్ సంబంధించి కింటల్లా లెక్కల్లో సంచులను మాత్రమే ప్రతి సంచి 50 కిలోలు అని లెక్క పెడుతూ ఇవ్వడం జరుగుతుంది. కానీ వాటిలో ఉన్న బియ్యం విలువ మాత్రం జోకే పరిస్థితి ఉండదు. తాజాగా ఎం ఎల్ ఎస్ కేంద్రంగా వెళ్లిన మండలంలోని 22 రేషన్ షాపులకు ప్రతి షాపుకు వారి అలాట్మెంట్ను బట్టి ఎక్కువ అలాట్మెంట్ ఉన్నవారికి కింటల్ 75 కిలోలు మరికొన్ని రేషన్ షాపులకు ఒక కింటల్ అలాగే 75 కిలోలు తక్కువ రావడం జరిగింది సుమారు ఈ నెలలో 22 రేషన్ డీలర్లకు దొడ్డు బియ్యం సరఫరాలు 26 కింటల్లా 50 కిలోల బియ్యం తక్కువ రావడం జరిగింది. ఒకవేళ సంచులు చినిగిపోవడం లేదా సంచులు కారణం లాంటి జరుగుతే ప్రతి సంచికి అరకిలో లేదా దానికంటే ఎక్కువ మోతాదులో రేషన్ బియ్యం తక్కువ రావడం జరుగుతుంది కానీ 26 కింటల్లో రేషన్ బియ్యం ఎలా కారిపోతాయి అన్న విషయం పై గమనిస్తే బియ్యం కారిపోయిన విషయం కాదు కమిట్మెంట్ వ్యవహారంతో తగ్గినాయని చెప్పడానికి దీనికంటే ఎక్కువ సాక్షం అవసరం లేదు.
ఎంఎల్ఎస్ కేంద్రం దండి కొట్టిన రేషన్ బియ్యం ప్రతి నెల ఎలెడ!? పేరుకు కిలో కిలోన్నర బియ్యం ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేసి వందల టన్నులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న కాంట్రాక్టర్ సివిల్ సప్లై అధికారులు.!?
ఇక్కడ వచ్చిన లారీల్లో ఉన్న నగదు నిలువ బియ్యం వ్యవహారం అంతా అక్కడ రికార్డయి ఉంటుందట, కాగితాల్లో ఉన్న రికార్డులు పక్కకు పెట్టి వాస్తవ రికార్డు వ్యవహారం కూడా వేరేది ఉంటుందట, విచిత్రంగా అనిపించడంలో విశేషం లేదు, ఎందుకంటే ఎంతో వేదస్సును ఉపయోగించి చేస్తున్న అక్రమ వ్యవహారం ఇది. గ్రేట్ వన్ కాంట్రాక్టర్ మరియు సివిల్ సప్లై అధికారులతో పాటు గ్రేట్ టు కాంట్రాక్టర్ అలాగే ఎంఎల్ఎస్ కేంద్ర నిర్వాహకుడు అంతా కలిసి చేపడుతున్నటువంటి వ్యవహారం ఇది. మహాదేవపూర్ ఎంఎల్ఎస్ కేంద్రానికి ఈనెల మొత్తం 18వ తేదీ నాటికి 24 లారీలు ప్రతి లారీ 600 బస్తాలను ఎంఎల్ఎస్ కేంద్రానికి తీసుకురావడం జరిగింది. సుమారు సిడబ్ల్యుసి గోదాం నుండి ఈనెల 5 మండలాలకు కలుపుకొని దొడ్డు మరియు సన్న బియ్యం 14 వేల నాలుగు వందల బ్యాగులు ఎం ఎల్ ఎస్ కేంద్రానికి చేరడం జరిగింది. వీటిలో ఉన్న నగదు విలువ అది కేవలం కాగితాలపైనే 29 క్వింటాళ్ల పేరుతో రాసి ఉంది. కానీ సంచుల్లో ఉన్న బియ్యం విలువ మాత్రం రాసిన దానికంటే ప్రతి లారీకి నాలుగు నుండి ఆరు కింటల వరకు అంటే 12 బస్తాల వరకు లెక్కలు ఉండవు కానీ అక్కడ మాత్రం ఈ 12 బస్తాలు
లెక్కలు ఉంటాయట ఈ 12 బస్తాల వ్యవహారం అధికారులకు అలాగే గ్రేట్ వన్ కాంట్రాక్టర్లకు గ్రేటు కాంట్రాక్టర్ కి మాత్రం దీనికి సంబంధించిన వివరాలు తిరిగి సిడబ్ల్యుసి ఎంఎల్ఎస్ కేంద్రం పేరుమీద తూకం పై తక్కువ వచ్చిన బియ్యాన్ని తిరిగి లెక్కలోకి తీసుకొని వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం జరుగుతుందట. ఇలా వేల రూపాయలతో ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించుటకు కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ప్రజలకు అందకుండా 50 కిలోల సంచి పేరుతో మోసానికి పాల్పడుతూ సివిల్ సప్లై అధికారులు గ్రేడ్ వన్ కాంట్రాక్టర్ తో పాటు గోదాం నిర్వాహకులు అంతా కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతూ ఒకవైపు ప్రభుత్వ సొమ్మును అడ్డదారిలో కాజేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా చేస్తున్నారనటానికి సందేహ పడాల్సిన అవసరం లేదు.