రజక సంఘo ఆధ్వర్యంలో ఘనంగా మడేళేశ్వరయ్య బోనాల ఉత్సవాలు

నడికూడ,నేటి ధాత్రి: మండల కేంద్రంలో రజక సంఘo ఆధ్వర్యంలో శ్రీ మడేళేశ్వరయ్య బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో డప్పు చప్పుల నడుమ బోనాలు ఎత్తుకొని శ్రీ మడేళేశ్వరయ్య కి, మారెమ్మ మరియు పోచమ్మ తల్లికి దూప దీప నైవేద్యాల తో బోనాలు సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల కో కన్వీనర్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నడికూడ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు) హాజరు కావడం జరిగింది..
ఈ కార్యక్రమంలో నడికూడ మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి,మండల దళిత బంధు కో ఆర్డినేటర్ కోడెపాక కరుణాకర్, గ్రామ సర్పంచ్ ఊర రవీందర్ రావు, చౌటుపర్తి గ్రామ సర్పంచ్ గూడెం కృష్ణమూర్తి, రజక సంఘ కుల పెద్దలు దురిశెట్టి రాజయ్య, మహేందర్, వెంకటేష్, చంద్రమౌళి,రవి, పోచనపెళ్ళి చంద్రమౌళి, సంపత్, విజయ్,ఉప్పుల వీరస్వామి, కుమారస్వామి,గొల్లపెల్లి శ్రీనివాస్, సంపత్ కుల పెద్దలు, ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!