ఈ నెల 12 న అమెరికాలో గుండెపోటుతో మృతి చెందగా శుక్రవారం అంత్యక్రియలు పూర్తి
భర్త ప్రస్తుత మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డిని ఎమ్మెల్యే పెద్ది, పలువురు అధికారులు,ప్రజా ప్రతినిధుల పరామర్శలు
నర్సంపేట, నేటిధాత్రి :
నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి సతీమణి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మునిగాల పద్మ ఈ నెల 12 న అమెరికాలో గుండెపోటుతో మృతి చెందగా శుక్రవారం తెల్లవారుజామున అమే మృతదేహాన్ని నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వాపురం తన నివాసానికి తీసుకువచ్చి భారీ ఊరేగింపులో అంత్యక్రియలు పూర్తి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.భర్త మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి తో కుటుంబ సభ్యులను ఓదార్చారు.అమే మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ గుంటి రజిని కిషన్,అర్ఎస్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాయిడి రవీందర్ రెడ్డి,
టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటనారాయణ గౌడ్,లెక్కల విద్యాసాగర్ రెడ్డి,యువరాజు,మండల శ్రీనివాస్,గంప రాజేశ్వర్ గౌడ్,రావుల సతీష్, పుట్టపాక కుమారస్వామి,నామాల సత్యనారాయణ, కౌన్సిలర్స్,ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
# మున్సిపాలిటీ పాలకవర్గం అధ్వర్యంలో…..
మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి బార్య మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల పద్మ అమెరికాలో గుండెపోటుతో మృతి చెందగా శుక్రవారం నర్సంపేటలో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ పాలకవర్గం అధ్వర్యంలో పద్మ మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.వెంకట్ రెడ్డిని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ గుంటి రజిని కిషన్,కౌన్సిలర్స్ మున్సిపల్ కమీషనర్ నాయిని వెంకటస్వామి,కౌన్సిలర్స్ దేవోజు తిరుమల సదానందం , శ్రీ జుర్రు రాజు,లూనావత్ కవిత,శీలం రాంబాబు గౌడ్,రామసహయం శ్రీదేవి ,మినుములు రాజు,
గందే రజిత చంద్రమౌళి, రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి, నాగిశెట్టి పద్మ ప్రసాద్, గంప సునీత రఘునాథ్ గౌడ్, రుద్ర మల్లీశ్వరి ఓం ప్రకాశ్,మహ్మద్ మహబూబ్ పాషా,వేల్పుగొండ
పద్మ,బోడ గోల్య, బాణాల ఇందిర, దార్ల రమాదేవి,వేముల సాంబయ్య గౌడ్, పెందెం లక్ష్మి రామనంద్, మున్సిపల్ మేనేజర్ రామక్రిష్ణ, ఏ.ఇ శాంతి స్వరూప్,సానిటరి ఇన్స్పెక్టర్ నాగరాజు,సిబ్బంది,కోఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గోన్నారు.