బిఆర్‌ఎస్‌ ను ఎదుర్కోలేక బిజేపి దొంగ దెబ్బ!?

`రెండో రాజధాని పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తే సహించేదే లేదు.

బిజేపి ఆడే పైలా పచ్చీసు రాజకీయాలు ఎలా వుంటాయన్న విషయాల మీద 

ఎమ్మెల్సీ ‘‘దండె విఠల్‌’’ , నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేంద్రరావు’’ తో సంబాషిస్తూ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే…

`రాజకీయ చిచ్చు…రెండో రాజధాని ఉచ్చు!?

`బిజేపి మొదలు పెట్డిన రాజకీయ కుట్ర?

`తెలంగాణ లో బిజేపి పాగా వేయడం కష్టమని తేలిపోయింది?

`కర్నాటక ఫలితాల తర్వాత కలవరం మొదలైంది.

`బిజేపి నుంచే వలసల కాలం కళ్లముందుంది!

`బిజేపిల కలవరపాటుకు గురవుతోంది!

`ఎలాగైనా బిఆర్‌ఎస్‌ బలం తగ్గితే తప్ప దెబ్బ తీయలేమని అర్థమైంది?

`సెటిలర్స్‌ మద్దతు వుంటుందని బిజేపి నమ్ముతున్నట్లుంది?

`అలాగైనా నాలుగు సీట్లు సాధించొచ్చని బిజేపి ఆరాట పడుతోంది.

`తెలంగాణ ఉద్యమ సమయంలోనే రెండో రాజధాని తెరమీదకు వచ్చింది.

`బిజేపి కొందరు చెబుతున్నట్లు అంబేద్కర్‌ రాజ్యాంగలో ప్రస్తావించారనేది అబద్ధం.

`బిజేపి అబద్దాలు అందరికీ తెలుసు.

`తను రాసిన పుస్తకంలో మాత్రమే అంబేద్కర్‌ ప్రస్తావించారు.

`అప్పటికీ ఇప్పటికీ అనేక మార్పులు వచ్చాయి.

`అంబేద్కర్‌ పేరు చెప్పి తెలంగాణ ను ఆగం చేయాలని చూస్తున్నారు.

`తెలంగాణ సమాజం సహించదు.

`పక్క రాష్ట్రాలు రాజకీయం చేయడం వేరు.

`అధికారంలోకి రావడం లేదని తెలంగాణ బిజేపి నాయకులు మాట్లాడడం తెలంగాణ కు ద్రోహం చేయడమే.

`తెలంగాణపై బిజేపి విషం చిమ్మడమే

-తెలంగాణ కోసం బిజేపి నేతలు కొట్లాడిరది లేదు.

-తెలంగాణ లో రాజకీయం చేసే నైతికతే బిజేపికి లేదు.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు వెతకడంలో బిజేపిని మించిన వారు లేరు. దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఇప్పటి వరకు ఒక్క మంచి పని చేసింది లేదు. ఒక్క పధకం ప్రకటించిన పాపాన కేంద్ర ప్రభుత్వం పోలేదు. కాని ఎప్పటికప్పుడు రాజకీయ పైలాపచ్చీసు తొండి ఆటలు ఆడడంలో మాత్రం ఆరితేరిపోయారు. తాజాగా తెలంగాణ మీద కుట్రకు బిజేపి తెరలేపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సరిగ్గా ఎన్నికల తరుణం దగ్గరపడుతున్న నేపధ్యంలో బిజేపి సీనియర్‌ నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్‌రావు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలన్న అంశాన్ని తెరమీదకు తెచ్చి, ప్రశాంతంగా వున్న తెలంగాణలో మళ్లీ కల్లోలం రేపాలని చూస్తున్నారు. కొన్ని దశాబ్ధాల పాటు గోసలు, అరిగోసలు చూసిన తెలంగాణ, ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో పచ్చగా, ప్రశాంతంగా, ఆత్మగౌరవంతో ముందుకుసాగుతోంది. ఇది బిజేపికి నచ్చడం లేదు. తెలంగాణ పచ్చగా వుండడం బిజేపికి ఏనాడు ఇష్టం లేదు. అందుకే సమయం సందర్భం లేకపోయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ మీద విషం చిమ్ముతూనే వుంటాడు. తెలంగాణ వచ్చిన సంతోషం తీరకముందే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో అక్కడి ప్రజలను రెచ్చగొట్టే విధంగా తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని రాజకీయాలు చేశాడు. ఓట్ల కోసం ఎంతకైనా దిగజరతామని నిరూపించారు. అన్నదమ్ములుగా విడిపోయాం….అభివృద్ది చేసుకుందామని స్నేహపూర్వక వాతావరణాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ సృష్టిస్తే, అడుగడుడునా తెలంగాణను బిజేపి కించపరుస్తూ వస్తోంది. ప్రధాన మంత్రి స్ధాయిలో వున్న వ్యక్తి కూడా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారంటూ వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలను అవమానానికి గురి చేయడం కాదా? తాజాగా అదే పార్టీకి చెందిన నాయకుడు విద్యాసాగర్‌రావు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తే బాగుంటుందంటూ చిలకపలుకులు పలికి, చిచ్చురేపాలని చూడడం ఎంత వరకు సమంజసం అంటూ బిజేపి కుత్సిర రాజకీయాలపై తనదైన శైలిలో బిఆర్‌ఎస్‌ నాయకుడు, ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఫైర్‌ అయ్యారు. నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో లేని, ప్రజలు మనసుగెల్చుకోలేని బిజేపి దేశంలోని రాజకీయాలను ఎలా చిన్నా భిన్నం చేస్తుందో చెబుతూ, పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అన్నది ప్రతి తెలంగాణ వాది కల.

 అరవైఏళ్ల గోస. అందుకు ముందు అదే పరిస్ధితి. హైదరాబాద్‌ రాష్ట్రం ఏర్పాటైనా, కొద్ది రోజులకే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటై ఎదుర్కొన్న వివక్ష, నిర్లక్ష్యాలు తెలంగాణ సమాజం అనుభవించిందే. అందుకే ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు నుంచి పోరాటం మొదలైనా, ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాతే అసలైన ఆత్మగౌరవం తెలంగాణలో వెల్లివిరిసింది. జై తెలంగాణ అన్న భావన ప్రతి గుండెను రగిలింపజేసింది. ప్రతి గొంతు జై తెలంగాణ అని నినదించింది. అప్పటి పాలకులను ప్రశ్నించింది. ఉద్యమం సాగింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో సాగిన ఉద్యమం పద్నాలుగేళ్లపాటు నిరంతరంగా సాగి, తెలంగాణ సాగించింది. అప్పటి నుంచి బిజేపి పార్టీ కుత్సిత రాజకీయాలు ఎలా వున్నాయో? నేటి తరానికి తెలియాల్సిన అవసరం వుంది. 1999లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజేపి పెద్దలు తెలంగాణపై విషం చిమ్మడం మొదలుపెట్టారు. అదేంటో 1998లో రాజమండ్రిలో జరిగిన బిజేపి జాతీయ సమావేశాలలో ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మాణం చేపట్టారు. ఆ తర్వాత కేంద్రంలో అధికారం కోసం తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేశారు. నాడు చంద్రబాబుతో కలిసి కేంద్రంలో అధికారం పంచుకొని, రాజధాని హైదరాబాద్‌లోనే వుండగా, తెలంగాణ ఎందుకు అంటూ అప్పటి ఉపప్రదాని అద్వాని కొంచెపు వ్యాఖ్యలు చేసి బిజేపి నిజస్వరూపం ఇదే అని నిరూపించారు. అందుకే ఆది నుంచి తెలంగాణ ప్రజలు రెండు నాలుకల బిజేపిని నమ్మడానికి ఏనాడు ఇష్టపడ లేదు. ఆనాడు అద్వాని, నేడు ప్రధాని మోడీ తెలంగాణపై ఒకటే వైఖరి అనుసరిస్తూ వచ్చారు. సరే దేశంలో రెండుసార్లు ప్రజలు అధికారం ఇస్తే ప్రజలకేమైనా చేశారా? అదీ లేదు. నోట్ల రద్దు చేశారు. దేశంలో నల్లదనం పోకపోతే అడగండి అన్నారు. యాభై రోజుల్లో దేశంలో వచ్చే మార్పు గమనించండి. లేకంటే నన్ను శిక్షించండి? అంటూ సాక్ష్యాత్తు ప్రధాని మోడీ ప్రకటించారు. కాని ఏం జరిగింది. దేశ ఆర్ధిక వ్యవస్ధ అస్తవ్యస్తమైంది. దేశం కోలుకోలేని స్ధితికి నెట్టివేయబడిరది. జిడిపి అమాంతం పడిపోయింది. కాని మనం మెరుగైన స్ధాయిలో వున్నామంటూ ప్రజలను మభ్యపెట్టడంలో మాకంటే ఘనులెవ్వరూ లేరని బిజేపి పెద్దలు నిరూపించారు. దేశమంతాటా ఒకే పన్ను అన్నారు. జిఎస్టీ తెస్తున్నామన్నారు. అర్ధరాత్రి స్వాతంత్య్రం అన్నంత గొప్పగా జిఎస్టీ అమలుకు శ్రీకారంచుట్టారు. ఏమైంది? అంటే సమాధానం చెప్పడానికి ఏ బిజేపి నేతకు నోరు రాదు. దేశంలో ధరలు అమాంతం పెరిగి పోయాయి. సామాన్యుడు బతకలేని పరిస్ధితి వచ్చింది. పెట్రోలు ధరలు పెరిగాయని, రూ.400 వున్న సిలిండర్‌ ధర సామాన్యులు మోయలేరంటూ సుద్దులు చెప్పిన బిజేపి ఇప్పుడు ధరలు ఆకాశాన్నంటిస్తూ, దేశం కోసం, ధర్మం కోసమంటూ ప్రజలు పీల్చి పిప్పిచేస్తోంది. ఇలా ప్రజలను భాదిస్తూ, మరో వైపు ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తూ, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారు. మధ్య ప్రదేశ్‌ ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టారు. మహారాష్ట్రలో అదే చేశారు. కర్నాకటలో చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రాష్ట్రాలలో ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా బిజేపి అధికారం సాగిస్తూ, డబుల్‌ ఇంజన్‌ సర్కారు అంటూ వింతపోకడను చూపిస్తోంది. 

కర్నాటక ఎన్నికల తర్వాత ఇక దక్షిణాదిలో పాగా వేయడం కష్టమని బిజేపి గ్రహించింది.

 అంతకు ముందు ఎగిరెగిరి పడి తెలంగాణలో రాజకీయ పబ్బం గడుపుకుందామని చూసింది. కాని కాలం గిర్రున తిరిగింది. కలగన్నంత సేపు కూడా బిజేపి సంతోషం నిలవలేదు. కర్నాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో పగటి కలలు వాస్తవంలోకి వచ్చాయి. దాంతో తెలంగాణలో మత రాజకీయాలు చోటు లేదు. బిజేపి బలానికి చోటు లేదు. తెలంగాణ రాజకీయాలను అస్ధిరపర్చే కుట్రకు తెరలేపినట్లుంది. అందుకే విద్యాసాగర్‌రావు అలాంటి వ్యాఖ్యలు చేసినట్లున్నారు. అంతే కాదు హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని చేయాలని రాజ్యాంగం రాసిన సందర్భంలో ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో చైనాతో యుద్దం చేయాల్సి వచ్చింది. అది అంబెద్కర్‌లో ఒక ఆలోచనకు కారణమైంది. 1955లో డాక్టర్‌. బాబాసాహేబ్‌ అంబెద్కర్‌ రాసిన దాట్స్‌ ఆన్‌ లివింగ్‌స్టిక్‌స్టేట్స్‌ అనే పుస్తకంలో 11 పేజీలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అంతేగాని దానిపై దేశంలో ఏనాడు చర్చ జరిగింది లేదు. అలాంటి చర్చ జరిగిన సందర్భాలు లేవు. కాకపోతే యుద్దాలు జరిగితే డిల్లీని టార్గెట్‌ చేసే శత్రుదేశాలకు రాజదాని కేంద్రం కొంత దూరం వుంటే బాగుంటుందన్న అభిప్రాయం మాత్రం వ్యక్తం చేశారు. అంతే కాకుండా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య బలమైన బంధాలు ఏర్పడానికి దోహదపడొచ్చు అన్నది వ్యక్తం చేశారు. నాటి పరిస్ధితులు వేరు. నేటి పరిస్ధితులు వేరు. అప్పటి పరిస్ధితులను బేరీజు వేసుకొని అంబెద్కర్‌ చెప్పిన ఈ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర విజభన సమయంలో కూడా ఇదే బిజేపి తెరమీదకు తెచ్చింది. అప్పుడే చిచ్చుపెట్టాలని చూసింది. అందులో భాగంగానే ఉమ్మడి రాజధాని, సెక్షన్‌ 8ని కూడా తీసుకొచ్చేందుకు దోహదపడ్డారు. 

 తెలంగాణ కోసం కోట్లాడిన చరిత్ర బిజేపికి లేదు.

 తెలంగాణ ప్రజల మనోభావాలు బిజేపికి అక్కర్లేదు. అదేంటో గాని తెలంగాణ బిజేపి నేతలకు కూడా తెలంగాణ ఆత్మగౌరవం అన్నదే లేదు. అసలు తెలంగాణ మీదే ప్రేమలేదు. అదే వుంటే ఇలా ప్రశాంతంగా వున్న తెలంగాణలో రాజకీయ కల్లోలం రేపేందుకు కుట్రలు చేయరు. ఇదీ బిజేపి అసలు రూపం… కుట్రల స్వరూపం. తెలంగాణ ప్రజలకు బిజేపి నైజం తెలుసు. అందుకే తెలంగాణలో బిజేపికి ఉనికి లేదు. ప్రజల్లో గుర్తింపులేదు. ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే నైతికత ఆ పార్టీకిఅసలే లేదు. ఇప్పటికైనా తెలంగాణ మీద ప్రేమను పెంచుకోండి. తెలంగాణ అభివృద్ధికి సహరించడం నేర్చుకోండి. పరాయి పాలనను తరిమి, స్వపరిపాలన తెచ్చుకొని ఆత్మగౌరవంతో తెలంగాణ తలెత్తుకొని నిలబడిరది. మళ్లీ కుంపటి రేపాలని చూస్తే ప్రజలు సహించరు. తగిన బుద్ది ప్రజలు చెబుతారు. గత ఎన్నికల్లోనే తెలంగాణలో అడ్రస్‌ లేకుండా చేశారు. అయినా బిజేపి మారలేదు. ఇప్పటికైనా మారకపోతే ఆ మాత్రం స్ధానం వుండదు. దక్షిణాది ప్రజలు ఎంతో చైతన్య వంతులు. వారిని మాయచేయాలని చూసి, కర్నాకటలో మూతి కాల్చుకున్నారు. ఇప్పటికైనా ప్రజల ఆలోచనా విధానంలోకి బిజేపిరావాలి.వాస్తవంలో నడవాలి. కుట్రలకు ఆపుకొని, అభివృద్ధి గురించి ఆలోచనలుచేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *