పరకాల లో సిపిఎం ర్యాలీ

నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్

పరకాల నేటిధాత్రి(టౌన్)
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వా ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిత్యవసర వస్తువు ధరలను తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సీపీఎం) ఆధ్వర్యంలో పరకాల లోని ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి మాట్లాడుతూ దేశంలో రోజురోజుకీ నిత్యవసర సరుకుల ధరలు హద్దు లేకుండా పెరుగుతున్నాయని, బియ్యము,పప్పులు, కూరగాయలు నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, దేశంలో కోట్లాదిమంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని వీరిపై పన్నుల భారం పెంచి మరింత దారిద్రంలోకి నేడుతున్నారని,నిత్యవసర వస్తువుల సరుకుల ధరలు 2014తో పోల్చుకుంటే 200% వరకు ధరలు పెరిగాయని, గ్యాస్ ధరలను 800 పెంచి 200కు తగ్గించి బిజెపి గొప్పగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని,గ్రామాల్లో ప్రజలు ఆధారపడే ఉపాధి హామీ పథకాన్ని తొలగించే పనిని బిజెపి చేస్తుందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ హామీగానే మిగిలిందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ ఉద్యోగాలు లేకుండా చేస్తుందని,బిజెపి ప్రభుత్వ విధానాలతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారని,సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని నెరవేర్చకుండా పోయిందని, విమర్శించారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ,నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామనే,ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని,మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దొగ్గేల తిరుపతి,సిపిఎం నాయకులు బొచ్చు కళ్యాణ్,మంద సురేష్, మడికొండ ప్రశాంత్,అక్రమ్, శివ,శ్రీధర్,బి.ఈశ్వర్, బి.నితిన్,లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!