టిప్పర్ డికొని వ్యక్తి మృతి

బోయినిపల్లి, నేటిధాత్రి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్తంభం పల్లి వద్ద టిప్పర్ డికొనీ ద్విచక్ర వాహన దారుడు మృతి చెందాడు

స్థానికుల కథనం ప్రకారం బోయినిపల్లి మండలం గుండన్నపల్లి కి చెందిన గుంట మల్లేశం 31 తన ద్విచ్రవాహనంపై బోయినిపల్లి నుండి గుండన్నపల్లి వైపు వెళ్తుండగా వేములవాడ నుండి బోయినపల్లి వైపు వస్తున్న టిప్పర్ డికొనడం తో మల్లేశం అక్కడికక్కడే మృతి చెందాడు.సంఘటన స్థలం కి వేములవాడ రూరల్ సిఐ బన్సీలాల్ బోయినిపల్లి ఎస్ ఐ మహేందర్ చేరుకొని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.మృతుని కి బార్య మౌనిక,కుమారుడు అవినాష్ 9 అనుశ్రీ 8 గల చిన్నారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!