చంద్రబాబు అరెస్ట్ పై నల్ల బ్యాడ్జిలతో నిరసన

 

చేర్యాల నేటిధాత్రి…

టిడిపి జాతీయ అధ్యక్షుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని స్థానిక గాంధీ విగ్రహం ఎదుట టిడిపి శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు కుర్రారం బాల్ నర్సయ్య మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అన్యాయంగా ఇరికించి అరెస్టు చేశారన్నారు. కక్ష సాధింపుతోనే వైసిపి ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని అయన మండిపడ్డాడు. ఈ కార్యక్రమంలో, పట్టణ అధ్యక్షుడు మిట్టపల్లి నారాయణరెడ్డి, కొమురవెల్లి మండల అధ్యక్షుడు పబ్బోజు రాములు చారి,పాములింగం, నర్ర కేశవులు,సత్య నారాయణ, శ్రీరాముల రాజు, చంద్రం,వడ్డెర కొమురయ్య, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!