కేయూ క్యాంపస్
కాకతీయ విశ్వవిద్యాలయ గణిత శాస్త్ర విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్ పర్సన్ గా డాక్టర్ జి. సౌజన్య ను రిజిస్ట్రార్ ఆచార్య టి శ్రీనివాస రావు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. డాక్టర్ సౌజన్య 2013 లో విశ్వవిద్యాలయం లో సహాయ ఆచార్యులు గా ప్రవేశించారు. డాక్టర్ సౌజన్య యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గణితశాస్త్ర విభాగ ఇంచార్జిగా అధిపతిగా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా, ఆర్ట్స్ కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా పనిచేసారు. ప్రస్తుతం డాక్టర్ సౌజన్య యూనివర్సిటీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన సౌజన్యను యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అధ్యాపకులు డాక్టర్ నాగయ్య, డాక్టర్ రవికుమార్, డాక్టర్ శ్రీ లక్ష్మి డాక్టర్ మంజుల అభినందించారు.