అన్ని దానాల్లో కంటె అన్నదానం మిన్న…*బింగి జంగయ్య యాదవ్…*
నేటీదాత్రీ (మేడిపల్లి):
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్బంగా బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్ ఒకటవ డివిజన్ చెంగిచర్ల క్రాంతి కాలనీ రోడ్ నంబర్ ఒకటిలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి బుధవారం రోజున ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం అమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, స్వాతి, దంపతులు సౌజన్యంతో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, పాల్గొని అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు కుల, మతాలకు అతీతంగా నిర్వహించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తు డివిజన్ ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల తో, ఉండేటట్టు వినాయకుడిని దీవించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.