వీణవంక (కరీంనగర్ జిల్లా)
నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామంలో పద్మశాలి సంఘం జనరల్ సెక్రెటరీ వడ్డేపల్లి రాజగోపాల్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ జెడ్పిటిసి అరకాల వీరేశలింగం పాల్గొని అతని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఎంతో కృషి చేశాడని ఇలాంటి వ్యక్తి తెలంగాణలో పుట్టడం ఎంతో గర్వకారణమని ఆయన చేసిన కొనియాడారు అనంతరం పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో
గాదె కొనసాగర్,వడ్డేపల్లి శ్రీనివాస్,వెంకటరమణ, సంపత్,సదయ్య, లక్ష్మీనారాయణ, మల్లయ్య ,వెంకటరాజం తదితరులు పాల్గొన్నారు.