ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు అందె అశోక్
ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో..
చేర్యాల నేటిధాత్రి…
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను త్రిప్పి కొట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు అందె అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట మావో కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. అఖిల భారత కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజారు వద్ద రాజీవ్ రహదారిపై గంటపాటు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిజెపి 9 సంవత్సరాల కాలంలో ప్రజలకు కార్మికులకు చేసింది శూన్యమన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మలచి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణ పేరుతో బ్యాంకింగ్, రైల్వే, ఎల్ఐసి, విమానం లాంటి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ బడా పెట్టుబడుదారులకు అప్పనంగా అమ్మేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు ఉపాధి, భద్రత లేకుండా కార్మికుల రక్తాన్ని పీల్చుకు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ గ్రాట్యూటీ, సమాన పనికి సమాన వేతనం, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతన చట్టం ప్రకారం ప్రతీ కార్మికునికి 26వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజల నడ్డీ విరుస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్పొరేట్ మతోన్మాద దోపిడీ ప్రభుత్వ విధానాలపై కార్మిక వర్గం ఏకమై కార్మిక హక్కులు సాధించడం కోసం ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సిఐటియు నాయకులు ఈరి భూమయ్య, శెట్టిపల్లి సత్తిరెడ్డి, పొన్నబోయిన మహేందర్, గూడెపు సుదర్శన్, రాళ్ల బండి నాగరాజు, తాడూరి వెంకట్ రెడ్డి, పోలోజు శ్రీహరి, కర్రె ఆంజనేయులు, గజ్జల సురేందర్, బోయిని మల్లేశం, మనేపల్లి కిష్టయ్య, మల్లం అంజయ్య, ఈరు మల్లయ్య, తిగుల్ల పర్శరాములు, దాసరి చక్రపాణి, తిగుల్ల కనకయ్య,ఎ ర్రోళ్ల ప్రభాకర్, సుంచు మల్లయ్య, కోతి ఎల్లిషా, రాజేశ్వరి, మల్లవ్వ, ప్రమీల, కనకవ్వ, తదితరులు పాల్గొన్నారు.