ఒడిషా రాష్ట్రం నైనీ ఏరియాలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరన 

సింగరేణి ఎస్ సి, ఎస్ టి ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి 

సింగరేణి ఎస్ సి, ఎస్ టి ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఈ రోజు ఒడిషా రాష్ట్రంలోని, అంగుల్ జిల్లా, నైని ఏరియా సింగరేణి ఆఫీస్ నందు ఎస్ సి ఎస్ టి అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నైనీ ఏరియా పి ఓ చౌదరి గారు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నైనీ బ్లాక్ సింగరేణి కి ఒక మణిహారం వంటిది అని చౌదరి తెలిపారు. సంవత్సరానికి పది మిలియన్ టన్నుల సామర్థ్యం గల నైనీ బ్లాక్ త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. సింగరేణి ఎస్ సి ఎస్ టి అసోసియేషన్ సభ్యులు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఈ జియాలజిస్ట్ చంద్రమౌళి, ఏజిఎం జియాలజి పంకజ్, మనేజర్ బ్రజేష్ కుమార్, ఎస్ ఈ (ఈ&ఎం) ముత్తువేల్, అసోసియేషన్ సభ్యులు కనుకుల తిరుపతి, ఎంవి రావు, ఇరుగురాళ్ళ శ్రీనివాస్, బందెల విజేందర్, పి.సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!