పరకాల నేటిధాత్రి(టౌన్)
యూఎస్ పిసి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటి ఆధ్వర్యంలో సమస్యల సాధనకై ఆగస్టు 12న జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీ, ధర్మాను విజయ వంతం చేయాలని యూఎస్ పిసి బాధ్యులు మేరుగు ప్రసన్న రాజారాం ఉపాధ్యాయులకు పిలుపు నిచ్చారు. మండలంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పిఆర్సి కమిటీ వేయాలని, జులై 1 నుంచి ఐఆర్ మంజూరు చేయాలని, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, కొత్త నియమకాలు చేపట్టాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, 317 జీఓ బాధితులకు న్యాయం చేయాలని, పండితులు, పీఈటీలకు పదోన్నతులు ఎయిడెడ్ ఉపాధ్యాయలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, ట్రెజరిలో ఆమోదం పొంది ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న బల్లులన్నింటిని సత్వరమే చెల్లించాలని మేరుగు ప్రసన్న డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాని యేడల సెప్టెంబర్ 1న ధర్నాచౌక్ వద్ద హైదరాబాద్ ధర్నా నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచుతామని, ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురై తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్ పిసి విశ్ననాధం, బిక్షపతి, రాజమౌళి, శశికళాదర్, సారయ్య, రాజయ్య, శ్రీలత, స్వప్న, శ్రీనాధ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు
ఉపాధ్యాయ సంఘాల ధర్నాను విజయవంతం చెయ్యాలి
