ఆట మొదలైంది!

బిజేపితో కేసిఆర్‌ రణమే!

అటు బిజేపిని ఎండగడుతూ…..

ఇటు తెలంగాణ సంక్షేమాలను ప్రజల దృష్టికి తెస్తూ…..

అతి తక్కువ కాలంలో తెలంగాణ విజయాలు వివరిస్తూ….

సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన పురోభివృద్ధి….

తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే విద్యుత్‌ వెలుగుల దీప్తి….

పారిశ్రామిక,ఐటి రంగంలో పురోగతి…

వ్యవసాయం రంగంలో పెరిగిన దిగుబడులు…

తెలంగాణలో రైతులకు అందుతున్న రైతు బంధు….

ఆసరా పించన్లు….

తెలంగాణ వ్యాప్తంగా అమలౌతున్న సంక్షేమాలన్నీ గుర్తుచేస్తూ….

బిజేపి పాలిత రాష్ట్రాలలో మాటల పాలనలో లోపాలు ఏకరుపు పెడుతూ….

కొత్తగా….సరికొత్తగా దేశ రాజకీయాల్లో మార్పుల దిశగా…కేసిఆర్‌ అడుగులు….

ఆట మొదలైంది…తెలంగాణ గడ్డ సాక్షిగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిండు అసెంబ్లీలో ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటినే డిల్లీ నడిబొడ్డున నిలబడి చెప్పాడు. సమర శంఖం పూరించాడు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది తప్పని ప్రపంచానికి చాటాడు. బిజేపి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. డిల్లీలో కూర్చొని పల్లెల్లో రైతుల ఉసురు బిజేపి నేతలు ఎలా తీస్తున్నారో వివరించారు. రైతులనుంచి కరంటు బిల్లులు వసూలుకు పన్నుతున్న కుట్రను బైటపెట్టారు. కరంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్రాల మీద తెస్తున్న ఒత్తిడిని దేశ ప్రజలకు తెలిపారు. కేంద్రాన్ని తూర్పార పట్టిండు. కేంద్ర ప్రభుత్వం అసలు రంగు బైట పెట్టిండు. అంతే కాదు తాను తమ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా మోటర్లు ఏర్పాటు చేసే ప్రసక్తి లేదని కేంద్రానికి తేల్చిచెప్పినట్లు డిల్లీలో కూడా బదులిచ్చారు. ప్రాణం పోయినా సరే రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గతంలో తెలంగాణలో అనేక సభల్లో, అసెంబ్లీలో ఎంత గట్టిగా చెప్పిండో, ఇప్పుడు కూడా ఆ మాటను ముఖ్యమంత్రి కేసిఆర్‌ మరోమారు స్పష్టం చేశారు. కేంద్రానికి అల్టిమేటమ్‌ జారీ చేశారు. పంజాబ్‌ రైతుల సమావేశంలోనే ఈ విషయాన్ని సూటిగా కేంద్రానికి చెప్పిండు. అంటే ఇక కేంద్రంతో రణమే..అన్న విషయాన్ని కేసిఆర్‌ స్పష్టం చేసినట్లే లెక్క. అందర్నీ కూడగట్టే ప్రయత్నం మొదలు పెట్టిండు. దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిండు. 

                        ముందు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నాయకులను కలుస్తున్నారు. వారితో మాటా మంతితో వారితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. పైగా రాష్ట్రాల హక్కులను కేంద్రం ఎలా కాలరాస్తుందన్న విషయాలపై కూడా పెద్దఎత్తున దేశ వ్యాప్తంగా చర్చ సాగాల్సిన తరుణం ఆసన్నమైందన్న సంగతని గుర్తు చేస్తున్నారు. కుతకుతలాడుతున్న ప్రజల అసంతృప్తిని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ధరల మోతతో సామాన్యుడు పడుతున్న వేధనపై మాట్లాడుతున్నాడు. బిజేపి అధికారంలోకి వచ్చిన నాడున్న పరిస్ధితులకు నేటికి తేడాలను పూస గుచ్చినట్లు వివరిస్తున్నాడు. దేశానికి అప్పు పెరిగింది. కాని జీడిపి పెరగలేదు. జిఎస్టీ తెచ్చారు. పన్నులు పెరిగాయి. దాంతో వసూళ్లు పెరిగాయే గాని ఆ సొమ్ముతో కొత్తగా ఈ ఎనమిదేళ్లలో కట్టిన ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేదు. దేశంలో కొత్తగా అఖిలభారత స్దాయిలో జరగాల్సిన నిర్మాణాలు జరగలేదు. కొత్త యూనివర్సిటీల నిర్మాణం లేదు. ఎయిమ్స్‌ లాంటి ఆసుపత్రలు వచ్చింది లేదు. జిఎస్టీవల్ల సాధించిందేమిటి? అన్న చర్చ ఇప్పటికే వుంది. దేశమంతా ఒకే రకమైన పన్ను విధానంతో ధరలు అదుపులోకి వస్తాయని చెప్పిన మాటలేమయ్యాయి? పెరుగుతున్న ధరల సంగతేమిటి? జిఎస్టీ మూలంగా మూత బడిన లక్షలాది పరిశ్రమల జాడేది.  

                       పరిశ్రమల మూతతో కోట్లాది మంది కోల్పోయిన కొలువుల గతేమిటి? నోట్ల రద్దు వల్ల ఒరిగిందేమిటి? పెద్ద నోట్ల రద్దు పేరు చెప్పి, తెచ్చిన 2వేల నోట్ల వల్ల ఎవరికి లాభం జరిగింది. పేద వాళ్లకేమైనా ఒనగూరిందా? మన దేశంలో కొన్ని నెలల పాటు ఏకథాటిగా రైతులు ఆందోళన చేసిన సందర్భం గతంలో ఎప్పుడైనా వుందా? ఈసారే ఎందుకు జరిగింది? సాక్ష్యాత్తు ప్రధాని చివరికి రైతులకు ఎందుకు క్షమాపణ చెప్పాలి వచ్చింది? కనీరెందుకు పెట్టుకోవాల్సివచ్చింది? ప్రశ్నిస్తే కేసులేమిటి? దేశ ద్రోహులన్న ముద్రలేమిటి? ఇలాంటి అనేక విషయాలపై దేశ ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం వుంది. దాని కోసం కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌ కార్యరంగంలోకి దిగారు… అందుకే ఇక దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. మొదటి పర్యటన విజయవంతంగా సాగిస్తున్నారు. ఇదిలా వుంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ముఖ చిత్రం. ఇప్పుడు తెలంగాణ ప్రగతి చిత్రం…. దేశానికంతటికీ తెలియాల్సిన అవసరం వుంది. తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పథకాలు ఏమిటి? వాటి వల్ల తెలంగాణలో వచ్చిన మార్పులేమిటి? సాగునీటి రంగంలో కేవలం ఏడేళ్ల తక్కువ సమయంలో సాధించిన విజాయలేమిటి? అన్న విషయాలన్నీంటినీ వివరిస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ప్రగతిని చూపిస్తున్నారు. 

                మరి మిగతా రాష్ట్రాల్లో అలాంటి ప్రాజెక్టులు ఎందుకు రావడం లేదన్నదానిని ప్రశ్నిస్తున్నారు? దేశంలో నదుల నుంచి వృధాగా సముద్రాలలో కలుస్తున్న నీరు సుమారు 60వేట టిఎంసిలు. అందులో కనీసం పదో వంతు కూడా దేశం వినియోగించుకోవడం లేదు. అంతో ఇంతో గతంలో ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించేది. కాని బిజేపి ప్రభుత్వం వచ్చాక దేశంలో సాగు రంగానికి కొత్తగా ఒరిగిందేమీ లేదు? సాగునీటి పారుదల రంగంలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు. మనదేశమే వ్యవసాయం దేశం. ప్రపపంచంలో అత్యధికంగా పత్తి, జనుము పండిచే దేశం. వాటితోపాటు ఆహార పంటలు పెద్దఎత్తున పండుతాయి. కూరగాయల సాగులో ప్రపంచంలోనే మొదటి స్ధానంలో వుంది. పాడి పరిశ్రమలోనూ ముందుంది. ఇవన్నీ కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మూలంగా దేశానికి వస్తున్న విజయాలు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 23లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఇప్పుడు 56 లక్షల ఎకరాల్లో వరిసాగవుతోంది. గతంలో మితగా ఆరుతడి పంటలుకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయింది. కారణం నాడు నీరు లేక తెలంగాణ ఎడారిలా బీడు వారి పోయింది. 

                       సమైక్య పాలకుల దాష్టికానికి తెలంగాణ బలైంది. నీటి జాడులు లేక కరువు విలయతాండవం చేసింది. తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలోనే మిషన్‌ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్దరణతో గ్రామాల్లో మళ్లీ నీటి జాడలు పెంపొందాయి. గోదావరి నీళ్లను ప్రతి గ్రామానికి చేరే విధంగా చేసి, చెరువులు నింపడంతో ప్రతి కుంట నిండిరది. ప్రతి బావి ఎల్లబోసింది. ఎండిన బోర్లు నిరంతరం పనిచేస్తున్నాయి. ఇదిలా వుంటే కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పధకం మూలంగా నిర్మాణమైన రిజర్వాయర్లు నిండడంతో తెలంగాణ వ్యాప్తంగా కరువు మాయమైపోయింది. తెలంగాణ వచ్చిన మూడు నెలల్లో ఇరవై నాలుగు గంటల కరంటు అందించడం జరిగింది. పల్లెలు, పట్టణాలు, రైతులు, పరిశ్రమలు అనే తేడా లేకుండా అన్ని రంగాలకు ఇరవైనాలుగు గంటల విద్యుత్‌ సరఫరా ఒక్క తెలంగాణలోనే జరుగుతోంది. అంతే కాదు వ్యవసాయానికి ఇరవైనాలుగు గంటల ఉచిత విద్యుత్‌ ఒక్క తెలంగాణలోనే అమలౌతోంది. ఇవన్నీ దేశంతా విస్తరించాలి. దేశమంతా పచ్చబడాలి. పాడి పంటలతో కళకళలాడాలి. పారిశ్రామిక రంగం ప్రపంచానికి దీటుగా పరుగులందుకోవాలి. ఒకనాడు మన కన్నా తక్కువ స్ధాయిలో వున్న చైనా , అమెరికాతో పోటీపడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక యువతరం వున్న వున్న దేశం మనది. విసృతమైన మానవ వనులున్నాయి. వారితో దేశంలో అద్భుతాలు సృష్టించొచ్చు. కాని బిజేపి అవేవీ చేయడం లేదన్నదే ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 

                   సహజంగా ప్రాంతీయ పార్టీలకు వున్నంత అంకిత భావం జాతీయ పార్టీలకు వుండదు. కాని దాన్ని వ్యతిరేకంగా జాతీయ పార్టీలు పనిగట్టుకొని ప్రచారం చేసి, ప్రాంతీయ పార్టీలపై విషం చిమ్ముతున్నారు. దేశాన్ని బాగు చేయాలన్న చిత్తశుద్ది అన్ని పార్టీలలోనూ వుండాలి. ఎంత సేపు మత రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని గాలికి వదిలేస్తే, పాలన గాడిలో పడదు. ప్రజలకు భారాలు తప్పవు. అందుకే దేశంలో నూతన రాజకీయ ఆవిష్కరణలు జరగాలి. అందుకు మరోసారి దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలి. కలిసి కట్టుగా బిజేపిని ఎదుర్కొవాలి. ఇప్పటికే దేశం అన్ని రంగాల్లో కునారిల్లుతోంది. బలమైన కేంద్రం పేరుతో రాష్ట్రాలను మరింత బలహీనం చేస్తోంది. రాష్ట్రాలను కేంద్రం చెప్పుచేతుల్లో పెట్టుకొని ఆధిపత్యం చేయాలనుకోవడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని కేసిఆర్‌ ప్రజల్లో చైతన్యం నింపేందుకు బయలు దేరారు. తొలి దశగా ఉత్తర ప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఐక్యతలో తొలి అడుగు వేశారు. తర్వాత డిల్లీ ఆప్‌ జాతీయ అధ్యక్షుడు కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. దేశ కాల మాన పరిస్ధితులపై చర్చలు జరిపారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనే ప్రతిపక్షాల ఐక్యత చూపిస్తేగాని, బిజేపిలో మార్పు రాదన్న సంకేతాలు పంపాలన్న ఆలోచనలో ముందగులు వేస్తున్నారు. దేశమంతా కేసిఆర్‌ వైపు ఆసక్తిగా చూసేలా రాజకీయాలకు అంకురార్పణ చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యతా బలం విలువేంటో చూపించాలనుకుంటున్నాడు. దేశానికి కొత్త తరం రాజకీయాలు పరిచయం చేయాలనుకుంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!