అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కెసిఆర్ పెద్దపీట

హైదరాబాద్( పాలకుర్తి), నేటి ధాత్రి:

అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కెసిఆర్ పెద్ద పీట వేస్తున్నారని

రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ, సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పాలకుర్తి మండలంలోని శాతాపురంలో పలు సిసి రోడ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన, చెన్నూరులో గ్రామపంచాయితీ భవనం, రైతువేదిక ల ప్రారంభోత్సవం, పెద్ద తండా(బి) లో గ్రామ పంచాయితీ లను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… అన్ని కులాలు, వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కెసిఆర్ పెద్ద పీట వేస్తున్నారు. దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా ఉంది. కరోనా కష్ట కాలం అభివృద్ధికి ఆటంకంగా మారింది. అయినా సీఎం కెసిఆర్ తన చాణక్యం తో అభివృద్ధి, సంక్షేమం లను ఆపలేదు. ఇంత కష్ట కాలం లో కూడా దళితులకు దళిత బంధు ఇస్తున్నాం. పేదలకు ఇండ్లు ఇస్తున్నాం. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నదన్నారు.

కేంద్ర సహకారం లేకున్నా, సాగునీరు, 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, రుణాల మాఫీ సహా పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. ప్రజల కోసం ఇంతగా చేస్తున్న ప్రభుత్వం దేశంలో లేదు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ, ప్రజలు సహకరించాలి. అన్ని గ్రామాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి. కరోనా ను కనిపించకుండా చేయాలి. ప్రజలంతా భాగస్వాములు కావాలి. అని మంత్రి ప్రజలకు ఉద్బోధించారు.

ఈ రోజు నిరుపేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక సీఎం కెసిఆర్ గారు నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు. డబుల్ బెడ్ రూం ఇండ్లు రానివాళ్లు బాధపడొద్దు. త్వరలో భూమి వున్న వాళ్లకు డబ్బులు ఇచ్చి మరీ ఇల్లు కట్టిస్తాం…అన్నారు.

కొందరు నాయకులు రాజకీయం చేస్తూ…కేంద్రం నుంచి అనేక నిధులు వస్తున్నాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.వాళ్లకు అన్ని తెలుసు. రైతు వేదికలు రైతులను సంఘటిత పరుస్తోంది. సీఎం కేసిఆర్ స్వయంగా రైతు కాబట్టే రైతుల మేలు కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. రైతు బంధు, రైతు భీమా, రుణమాఫీ లాంటి పథకాలు ప్రవేశపెట్టి రైతును రాజు ను చేశారు. ఎవరూ ఊహించని దళిత బంధు పథకం ప్రవేశపెట్టి దళితులకు ఆరాధ్య దైవం గా కెసిఆర్ మారారు. ఊరిలో నిజమైన పేదోల్లు దళితులు అందుకే వాళ్లకు 10 లక్షలు ఇస్తున్నాం. ముందుగా దళితులు, తరువాత ఎస్ టీ లు, బీసీ లకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తాం. అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

కరోనా వల్ల మనం చాలా నష్టపోయాం అయినా అందరికీ పథకాలు అందిస్తున్నాం. గ్రామాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు అందరూ ఉపయోగించుకొని కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవాలి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *