అన్నదానం ఎంతో గొప్పది – ఎస్ఐ పి రామారావు

వినాయక మండపం వద్ద నిత్యాన్నదానం.

మహిళలకు బహుమతులు అందించిన ఎస్సై, జర్నలిస్టులు…

కారేపల్లి నేటి ధాత్రి.

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక మండపంలో కారేపల్లి ఎస్సై, మండల జర్నలిస్టులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. కారేపల్లి మండల పరిధిలోని వెంకట్యా తండ గ్రామంలో రెండో వార్డులో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలో భాగంగా వార్డు మెంబర్ బాలునాయక్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో తొమ్మిది రోజులపాటు నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు. నిత్య అన్నదానంలో భాగంగా ఐదవ రోజు బానోతు హనుమ, నిర్మల (ఉత్తమ ఉపాధ్యాయుడు) దంపతులు, తిరుమల సింగ్ (జ్యువెలరీ షాప్) దంపతులు ఆధ్వర్యంలో గణేశునికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం ఏర్పాటు చేశారు..
అన్నదానం ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుడు హనుమ – నిర్మల దంపతులను, తిరుమల సింగ్ దంపతులను రెండో వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదానం అనంతరం మహిళలకు బహుమతులను కారేపల్లి ఎస్సై పుష్పాల రామారావు, మండల జర్నలిస్టులు దమ్మలపాటి కృష్ణ, పాలిక శ్రీనివాస్, జిట్టబోయిన శ్రీనివాస్, బాలు నాయక్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు మాట్లాడుతూ.. అన్ని దానాలలో అన్నదానం ఎంతో గొప్పదని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జర్పుల లాలు నాయక్,భుక్య రామ్ సింగ్ , గుగులోతు పర్షియా, బానోతు సెట్ రామ్, భావుసింగ్, భిచ్చు, యువ నాయకులు ప్రేమ్ కుమార్, జగన్ నాయక్, హేమంత్, అఖిల్, ఉదయ్, కుటుంబరావు, కమిటీ సభ్యులు విష్ణు,రాకేష్, హర్ష, ఇంద్రజిత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!