ZPHS Girls Excel in Telangana Olympiad
ప్రతిభ కనబరిచిన జడ్ పిహెచ్ఎస్ బాలికలు
శుభాకాంక్షలు తెలిపిన ఉపాధ్యాయులు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో ఆంగ్ల భాష ఉపాధ్యాయులు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండలస్థాయి తెలంగాణ ఒలంపియాడ్ పరీక్షలో శాయంపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠ శాల పదవ తరగతి చదువు తున్న దీవెన మొదటి బహు మతి సాధించి, ఎడ్యుక్వాస్ట్ సీనియర్ విభాగంలో ఎండి రేష్మ మొదటి బహుమతి సాధించగా,జూనియర్ విభాగంలో రుక్మిణి ప్రథమ బహుమతి సాధించింది. నాలుగు బహుమతులకు గాను మూడు బహుమతులు పాఠశాల విద్యార్థులు సాధిం చారు. ఈ విద్యార్థులు జిల్లా స్థాయికి అర్హత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు శేఖర్ బాబుకు, బహుమతులు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు శ్రీలత శుభాకాంక్షలు తెలియజేశారు.
