Zilla Parishad High School
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, ఐడికార్డ్ ల పంపిని
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా పాఠశాలలో చేరిన 45 మంది 6 వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్వామి వివేకానంద సేవాసమితి మల్యాల వారి సహకారంతో ఉచితంగా ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర ఆధ్వర్యంలో టై, బెల్ట్, ఐడికార్డ్స్ అందించారు.
ఈ సందర్భంగా స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ చదువుల్లో, ఆటల్లో విద్యార్థులందరూ పోటీ తత్వంతో ముందుండాలని కోరారు. ప్రతి సంవత్సరం ఇలాగే జిల్లా పరిషత్ పాఠశాలలో చేరిన ఆరవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా టై,బెల్ట్, ఐడికార్డ్ లను అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర, మరియు టీచర్స్ అమర్ నాథ్, రవీందర్,రాజ్ కుమార్, లావణ్య, స్వర్ణలత, రజిత,స్వప్న,మమత,లావణ్య
స్వామి వివేకానంద సేవాసమితి సభ్యులు కొడకంటి గంగాధర్,పంచెరుపుల దివ్యసాగర్, మోత్కుపల్లి మధు,లోకోజు సతీష్, ఎన్నం శ్రీకాంత్, పొంచెట్టి నవీన్,సాన జలందర్,గొల్లపల్లి సాయి కృష్ణ,లక్క అనిల్, అనపర్తి వెంకటేష్ మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
