
వరి కొయ్యలను కాల్చకూడదు.
మండల రైతులకు ఏ.ఓ .సూచన.
మహా ముత్తారం నేటి ధాత్రి.
జీలుగా విత్తనాలు వాడి భూసారం పెంచుకోవాలని మహా ముత్తారం మండల రైతులకు ఏ.ఓ తెలియజేశారు. మహముత్తారం మండల రైతులకు 60 శాతం సబ్సిడీపై జీలు గ విత్తనాలు పంపిణీ చేయడానికి పిఎసిఎస్ మహా ముత్తారంవద్ద బస్తాలు అందు బాటలో ఉంచడం జరిగింది తెలియజేశారు.30 కిలోల బస్తా పూర్తి ధర 2.790 రూపాయలు ఉంటుంది కానీ సబ్సిడీ పై రైతు చెల్లించవలసిన ధర 1. 116 మాత్రమేనని తెలియజేశారు .ఇట్టి విత్తనాలు కావలసిన రైతులు ఆధార్ మరియు పట్టా పాస్ బుక్ తో రైతు వేదిక వద్ద ఏఈఓ తో పర్మిట్ నెంబర్ తీసుకొని పిఎసిఎస్ మహాముత్తారం కార్యాలయంలో బస్తాలు తీసుకోగలరు .అదేవిధంగా జి లుగా విత్తనాలు వాడడం వలన భూసారం పెరుగుతుందని రసాయన ఎరువుల ఖర్చు తగ్గించవచ్చునని మరియు మంచి దిగుబడి సాధించవచ్చునని తెలియజేశారు .అదేవిధంగా యాసాంగిలో వరివేసిన రైతులు పంట కోత అనంతరం మిగిలిన వరి కొయ్యలను నేలలోనే కచ్చితంగా కలియ దున్ని భూసారం పెంచుకోవాలని తెలియజేశారు కలియ దున్నిన తర్వాత త్వరగా కుల్లడానికి మూడు బస్తాల సింగిల్ సూపర్ పాస్పెట్ వాడాలని తెలియజేశారు అలా కాకుండా వరి కోయ్యలను కాల్చితే
భూములు చెడుగా మారతాయని తెలియజేశారుకావున ఏ ఒక్క రైతు కూడా వరి కొయ్యలనుకాల్చకూడదని రైతులకుసూచించారు.