సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
నారాయణాఖేడ్ నియోజకవర్గంలోని మున్సిపల్ పరిధిలో ఉన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ గారి స్వగృహంలో సంక్రాంతి పండుగ సందర్బంగా ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్,జీత్తు శెట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అప్పారావు శెట్కార్ కలిసి కైట్లను ఆవిష్కరించి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ, చైనా మంజాను వినియోగించకూడదని, ప్రజలు భద్రతను దృష్టిలో ఉంచుకుని సంప్రదాయ పద్ధతుల్లోనే పండుగను జరుపుకోవాలని సూచించారు. అలాగే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత, సాంప్రదాయ విలువలపై వివరించారు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
