స్థానిక సంస్థలలో యువత పెద్ద ఎత్తున పోటీ చేయాలి

నేషనల్ ఫోరం ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బొమ్మరగొనీ కిరణ్ ఫిషర్ అడ్వకేట్
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :

తెలంగాణ లో జరగబోయే స్థానిక సంస్థలలో రాష్టం లో ఉన్న నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పోటీ చేయాలి అని నేషనల్ ఫోరం ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరగోని కిరణ్ ఫిషర్ అడ్వకేట్ అన్నారు, దేశానికి వెన్నుముక అయినటువంటి గ్రామాలు అభివ్రుద్ది పథం లో నడిపించాలంటే పెద్ద మొత్తంలో యువత పాత్ర ఎక్కువగా ఉండాలని, సర్పంచ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ,గా పోటీ చేయాలని అన్నారు, బాగా చదువుకున్న యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన అన్నారు, చదువుకున్న యువత పోటీ చేయాలంటే డబ్బు రాజకీయం వల్ల ఇబ్బందులు ఉన్నాయి అని అన్నారు, ప్రజలు ఓటును అమ్ముకోకుండా విజ్ఞాన వంతులకు అవకాశం ఇచ్చి సేవలు చేయించుకోవాలి అని ఆయన అన్నారు,
కాబట్టి గ్రామాల్లో ప్రజలు చదువుకున్న యువత కు అవకాశాలు ఇవ్వాలని అని, అదేవిదంగా కనీసం సర్పంచ్ గా పదవతరగతి అర్హత ను జోడించాలి అని అన్నారు, అయన వెంట నల్గొండ జిల్లా కన్వీనర్ రఘుమా రెడ్డి, నాయకులు, బుర్కల సైదులు, మండల రాజు,
తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!