సంఘ సేవల్లో యువత ముందుకు రావాలి.
ఘనంగా నేతాజీ పురుషుల పొదుపు సంఘం సిల్వర్ జూబ్లీ మహోత్సవం.
నర్సంపేట నేటిధాత్రి:
గ్రామీణ ప్రజల్లో సమిష్టిగా పొదుపు చేయు అలవాట్లు ప్రవేశపెట్టి సంఘటితంగా సహకార శక్తిని పెంపొందించడం కోసం స్వకృషి ఉద్యమం పనిచేస్తుందని ఈ క్రమంలో సంఘాలు మరింత అభివృద్ధి చెందాలంటే యువత సంఘానికి సేవలు అందించడానికి ముందుకు రావాలని దుగ్గొండి పురుషుల పొదుపు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నీల రవీందర్,ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ అన్నారు.నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామంలో గల నేతాజీ పురుషుల పొదుపు సంఘం 25 వ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ మహోత్సవం కార్యక్రమం సంఘం అధ్యక్షుడు పెండ్యాల మల్లేశం అధ్యక్షతన సంఘం కార్యాలయం వద్ద జరిగింది.ముందుగా సంఘ 2024-25 వార్షిక ఆదాయ వ్యయాల నివేదికలను సంఘం అధ్యక్షుడు మల్లేశం,గణకుడు
ధూపటి వెంకటేశ్వర్లు ప్రవేశ పెట్టారు.1996లో వ్యవస్థాపక అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వల్గుబెల్లి రంగారెడ్డి స్థాపించగా అనేక ఒడుదొలుగులతో నేడు ఉత్తమ సంఘంగా రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకరం అని సంఘం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ముఖ్య అతిదులుగా హాజరైన నీల రవీందర్ మాట్లాడుతూ గ్రామాల్లో స్వకృషి ఉద్యమ పొదుపు సంఘాలు అంటే ఒక బంగారుబాతులాంటివని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్యులే అని పేర్కొన్నారు.సభ్యులు సంఘాలను పునాదులుగా ఉంటే తల్లిదండ్రుల పాత్ర పాలకవర్గ సభ్యులు పోషించాల్సి ఉంటున్నదన్నారు.సహకార వికాస సంస్థ ఎలాంటి లాబార్జిత పొందకుండా సేవలు అందిస్తున్నదని సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో
సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు వల్గుబెల్లి రంగారెడ్డి,సంఘ ఉపాధ్యక్షులు గంగిడి రాజిరెడ్డి పాలకవర్గ సభ్యులు చిట్టోజు రాము, పంజాల భాస్కర్, వల్గుబెల్లి మోహన్ రెడ్డి, మిట్టగడపల సాంబయ్య,అన్నం లింగారెడ్డి,ఓదెల రవి,మెరుగు రాజు, ఒద్దుల బుచ్చిరెడ్డి, వంగపెల్లి కమలాకర్ రెడ్డి, మిట్టగడపల బాబు,మాజీ అధ్యక్షులు నరహరి కట్టారెడ్డి, సాంబరాతి శ్రీనివాస్, చిట్టొజు రమణ చారి,పెండ్యాల మల్లేశం,సాంబరాతి రమేష్, చిట్టోజు రాము,గంగిడి రాజిరెడ్డి, వ్యవస్థాపక పాలకవర్గం లింగాల నరసయ్య, దొడ్డు జయపాల్ రెడ్డి,మాజీ వ్యవస్థాపక పాలకవర్గం సభ్యులు,సమితి పరిది సంఘాల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,ప్రభాకర్,రాయరాకుల రమేష్,బాబు,సమితి గణకుడు రమణాచారి,సభ్యులు పాల్గొన్నారు.

నూతన అధ్యక్ష,ఉపాధ్యక్షుల ఎన్నిక..
నేతాజీ పురుషుల పొదుపు సంఘం 2025-26 సంవత్సరానికి గాను అధ్యక్ష ఉపాధ్యక్షుల ఎన్నికల కోసం ఎన్నికల అధికారి కందుల శ్రీనివాస్ గౌడ్ చేపట్టగా అధ్యక్షులుగా అన్నం లింగారెడ్డి,ఉపాధ్యక్షులుగా మేర్గు రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్,సంఘం అధ్యక్షుడు మల్లేశం,ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి పాలకవర్గం పాల్గొన్నారు.