పోచమ్మ ఆలయంలో నీ పోతలింగేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం
ఓదెల(పెద్దపల్లి జిల్లా):
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో 28వ రైల్వే గేట్ దగ్గర పోచమ్మ తల్లి దేవాలయంలో పోతలింగేశ్వర స్వామి విగ్రహాన్ని బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని పరిశీలించి ఆ సంఘటన హిందువులకు చాలా బాధాకరమైన సంఘటన కావున హిందూ సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోక నిర్వహించిడం జరిగింది. విషయం తెలుసుకున్న పోత్కపల్లి ఎస్సై ధీకొండ రమేష్ సిబ్బందితో పాటు సంఘటన స్థలానికి చేరుకుని ధర్నా చేస్తున్న వారితో మాట్లాడుతూ విగ్రహాన్ని పరిశీలించి త్వరలోనే ఈ సంఘటన కు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తామని తెలియజేసి ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది.