తాసిల్దార్ కు రైతులు వినతి పత్రం అందజేత.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల తహసీల్దార్ కార్యాలయం లో నేషనల్ హైవే లో భూములు కోల్పోతున్న రైతులు బుధవారం రోజున తహసీల్దార్ ను భూములు కోల్పోతున్న రైతులు కలిసి తన బాధను చెప్పుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీరిచ్చే పరిహారం సరిపోదు. మరియు భూమి కోల్పోతున్న ఒక్కో ఎకరా బహిరంగ మార్కెట్ లో ఉన్నట్టు రూ 4000000 లు చెల్లించాలి అని. మాకు భూమికి బదులు భూమి ఇవ్వాలని, కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూములు కోల్పోతున్న రైతులు పాల్గొన్నారు.