యోగాను నిత్య ప్రక్రియగా పాటించాలి.

yoga.

యోగాను నిత్య ప్రక్రియగా పాటించాలి

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల నేటిధాత్రి:

 

నిరంతర యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుంకుమేశ్వర స్వామి ఆలయ చైర్మన్,యోగ గురువు కొల్గూరి రాజేశ్వర రావు ఆద్వర్యంలో శనివారం పరకాల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పతంజలి యోగ మహర్షికి జ్యోతి ప్రజ్వలన గావించి సుమారు రెండు గంటల పాటు వివిధ రకాల యోగాసనాల,ప్రణాయమాలు పట్టించడం జరిగింది.అనంతరం యోగా”డే”ను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా,ఆనందంగా గడపాలంటే ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి యోగాను నిత్య ప్రక్రియగా పాటించాలన్నారు.తాను కొంత కాలంగా యోగ వర్చ్యువల్ గా పాటిస్తున్నట్లు తెలిపారు.

yoga.

మానసిక ప్రశాంత చేకురుతుందని,ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నట్లు వెల్లడించారు.యోగా
9సంవత్సరాల వయస్సు నుండి 90 సంవత్సరాల వయస్సు వరకు యోగాను ఎవరైన పటించ వచ్చన్నారు.
యోగ గురువు రాజేశ్వరరావు మాట్లాడుతూ యోగా డే ప్రాశస్త్యాన్ని వివరించారు.అనంతరం అతిథులను శాలువాతో ఘనంగా సన్మానించి,మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి తన జన్మదినం సందర్భంగా అందించిన భగవద్గీతను యోగ అభ్యాసకులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్డీవో డాక్టర్ కే నారాయణ,మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ సుష్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,సిఐ క్రాంతికుమార్, కాంగ్రెస్ నాయకులు పాడి ప్రతాప్ రెడ్డి,ప్రభుత్వ వైద్యులు డాక్టర్ మౌనిక,ప్రభుత్వ అయూష్ వైద్యాధికారి సీనియర్ జర్నలిస్టు మెండు రవిందర్,మాజీ కౌన్సిలర్ పంచగిరి జయమ్మ,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!