యోగాతో ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు
యువత వ్యసనాలకు బానిస కావద్దు….
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ములుగు జిల్లా నేటిధాత్రి:
ప్రతి ఒక్కరూ యోగ చేయడం వలన వారి ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటారని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని డి బ్ల్యూ సి డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో నిర్వహించిన యోగ కార్యక్రమంలో అదనం కలెక్టర్ మహేందర్ జి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి గోపాల్ రావు తో కలిసి జ్యోతి ప్రజ్వల చేసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానసిక, శారీరక, ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు యోగా చేయాలని సూచించారు. యువతీ యువకులు వ్యసనాలకు బానిస కాకుండా మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని అన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం వేళలా కొంత సమయాన్ని కేటాయిస్తూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, యోగ చేయడం వలన పలు రకాల వ్యాధులు దరి చేరకుండానే ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు.
అనంతరం యోగ ఆసనాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు,
జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ లీ చంద్ర, డాక్టర్ సంధ్య (జిల్లా ఇన్చార్జ్) యోగ ఇన్స్ట్రక్టర్ శ్రీ గురు శివ కృష్ణ, హరిత, మానస, లయ, ప్రియాంక, గిరివర్ధన్ లు పాల్గొన్నారు.