జ్ఞానాన్ని పెంపొందించేందుకు యోగా దోహదపడుతోంది

బార్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బల్ల మహేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

జ్ఞానాన్ని పెంపొందించేందుకు యోగా దోహదపడుతుందని బార్ అసోసియేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి బల్ల మహేందర్ తెలిపారు.
శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో శ్రీ పరివార్ యోగ గురువు యాసోజు మాధవచారి ఆధ్వర్యంలో 14 సంవత్సరాల లోపు బాల బాలికల కు వ్యక్తిత్వ, వికాస నైపుణ్యత పై జరుగుతున్న శిక్షణ తరగతులను పరిశీలించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరికి యోగా సాధన తప్పనిసరిగా చేయాలన్నారు.యోగా శారీరక దృఢత్వాన్ని అందిస్తుందన్నారు. ఇది మీ మనస్సు , శరీరానికి ప్రశాంతత మరియు శాంతిని కలిగిస్తుందన్నారు. ఆందోళన, నిరాశ , నొప్పి వంటి రుగ్మతలకు సహాయపడుతుందన్నారు. తమ లక్ష్యాలను చేరుకోవాలంటే
బాల్యం నుండే యోగ అలవాటు చేసుకోవాలని, ప్రధానంగా చెడు అలవాట్ల తో పాటు సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని బాల, బాలికలకు సూచించారు.
త్వరలోనే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా సాధనకు సిద్ధమవుతున్నామని తెలిపారు. మాధవచారి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.
అనంతరం బాల బాలికలకు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాధకులు తాటి వెంకన్న, బొడ్డు వంశీకృష్ణ, సామంతుల శ్యామ్, ఎర్రం సతీష్ కుమార్, వేషాల రవీందర్, బడితల రమేష్, శేఖర్ నాని, తోపాటు బాల సాధకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!