ఠాగూర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు
రామకృష్ణాపూర్ నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో బిజెపి పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన సింగ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యోగ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తలపెట్టినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. యోగ ప్రాచీన భారతీయ సంప్రదాయమని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి కళాధర్ రెడ్డి, పద్మ, కట్ట ఈశ్వర చారి, రమేష్, పోషం,చంద్రమౌళి, సతీష్, ప్రసాద్, తిరుపతిరెడ్డి, నూనె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.