ఉపాధి పనికి వెళ్లిన కార్మికుడు మృతి
చందుర్తి, నేటిధాత్రి:
ఈ రోజు అనగా శనివారం రోజున ఉదయం 9 గంటల 30 నిమిషాలకు చందుర్తి మండలం ఎన్గల్ గ్రామములో ఉపాధి హామీ పనులో భాగంగా రోడ్డు పనులు చేసి మధ్యలో అన్నం తినేటప్పుడు పసుల లచ్చయ్య s/o రాజయ్య, అకస్మాత్తుగా పడిపపోవడం జరిగినది వెంటనే అంబేలెన్స్ కి కాల్ చేసి తెప్పించి ఏరియా ఆసుపత్రి వేములవాడ కు తీసుకువెళ్లడం జరిగినది అక్కడ డాక్టర్లు ఇసిజి తీసిన తర్వాత లచ్చయ్య చనిపోయాడని తెలియజేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.