విధుల పట్ల అంకిత భావంతో పని చేయాలి

*నేరాల నియంత్రణకై విసిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి

*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్

వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం రోజున వేములవాడ డిఎస్పీ కార్యాలయం,వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వేములవాడ డి.ఎస్.పి కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డ్స్ ను,సిడి ఫైల్స్ తనిఖీ చేసి ,సబ్ డిివిజనల్ పరిధిలో నమోదు అయిన కేసుల వివరాలు,ఎస్సీ ఎస్టీ, ఫోక్సో కేసుల, గ్రేవ్ కేసులలో,అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసుల వివరాల అడిగి తెలుసుకుని పలు సూచనలు చేసి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లలోఎక్కువగా నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం వార్షిక తనిఖీల్లో భాగంగా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, రికార్డ్స్ , సీడీ ఫైల్స్ ను ఫంక్షన్ హాల్ వర్టికల్స్ అమలు తీరు,స్టేషన్ లో అమలవుతున్న 5s తీరును పరిశీలించి నమోదు అయిన కేసులల్లో ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఉండాలని కేసుల్లో శిక్షల శాతం పెంచాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.
అధికారులు, సిబ్బంది విధులల్లో అలసత్వం వహించకూడదని,పోలీసులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలన్నారు,విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని గ్రామాల్లో తరచు పర్యటిస్తూ ప్రజలతో సస్సబంధాలు కలిగి ఉండాలని అన్నారు.నేరాల నియంత్రణకై పోలీస్ స్టేషన్ లో పెట్రోలింగ్,విజిబుల్ పోలీసింగ్ లు నిర్వహించాలన్నారు.
వివిధ ప్రాంతాల నుండి రాజన్న దర్శనికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు.రానున్న ఎన్నికలు దృష్ట్యా సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండు ఎన్నికలకు సన్నద్ధం కావాలని అన్నారు.,పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్తులు, సస్పెక్ట్ లు, రౌడీ షీటర్లపై నిఘాను ఉంచాలన్నారు. వేములవాడ సబ్ డివిసిన్ పరిధిలో సుమారు 823 గణేష్ విగ్రహాలు ఉన్నాయని వేములవాడ పట్టణ పరిధిలో 180 వరకు గణేష్ విగ్రహాల ఉన్నాయని,బుధవారం రోజున జరిగే
గణేష్ శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సిబ్బందికి కేటాయించిన గణేష్ మండపాలను సందర్శించి గణేష్ మండపాల నిర్వహకులతో మాట్లాడి బుధవారం రోజున మధ్యాన్నం 2 గంటల వరకు గణేష్ శోభయాత్ర మొదలై రాత్రి 12 గంటల లోపు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని,గణేష్ శోభయాత్రలో డి జె లకు అనుమతి లేదని,నిబంధనలకు విరుద్ధంగా డిజె లు వినియోగించే వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.ఎస్పీ వెంట వేములవాడ డీఎస్పీ నాగేంద్రచరి, పట్టణ సి.ఐ కరుణాకర్, సి. ఐ లు కృష్ణకుమార్, కిరణ్, ఎస్.ఐ లు రమేష్, ప్రశాంత్, దిలీప్ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!