నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ కు సూచన
16వ డివిజన్ లో పర్యటించిన కార్పొరేటర్.
కాశిబుగ్గ నేటిధాత్రి
వరంగల్ మహా నగర పాలకసంస్థ 16వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ పర్యటించారు. డివిజన్ పరిధిలోని జాన్ పాక లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మానయ్య గల్లీలో నూతనంగా ప్రారంభమైన సీసీ రోడ్డు నిర్మాణం నాణ్యతతో కూడిన మెటీరియల్ వాడాలని, సకాలంలో పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ కి సూచించారు.
ఈ కార్యక్రమంలో జాన్ పాక గ్రామ బీ.ఆర్.యస్ పార్టీ నాయకులు ఎండీ ఆరిఫ్,గాడ్దుల రాజు,బోనాల రమేష్,రామ్ దేవ్,రహీమ్ మరియు తదితరులు పాల్గొన్నారు