ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి బాలాజీ
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను రక్షణ సోషల్ సర్వీస్ సొసైటీ లింగామల్ల రమాదేవి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈసందర్బంగా అడవి శ్రీరాంపూర్ ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి బాలాజీ మాట్లాడుతూ మహిళా వంటింట్లో పరిమితం కాకుండా అన్ని రంగాలలో ముందుడాలి ఈ రోజుల్లో రాజకీయాలలో కావచ్చు విద్య రంగం లో వైద్య రంగం లో పలు సొసైటీ కార్యక్రమం లో దూసుకు పోతున్నారు మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి అని అన్నారు
లింగమల్ల రమాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిలుగా మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు బందెల. యాధలక్ష్మీ, స్త్రీ శక్తి ఎంటర్ ప్రైజెస్ అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ
రక్షణ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి ఎంటర్ప్రిజేస్ వారి సౌజన్యంతో ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అనంతరం ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి బాలాజీ, ముత్తారం సర్పంచ్ తూటి రజిత రఫీ ని అంగన్వాడీ టీచర్స్ బద్రి రమాదేవి మంథని తిరుమల ని శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం సుమలత మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో ముందంజలో ఉండలని వ్యాపార రంగాలలో చిన్న చిన్న వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకొంటూ అభివృద్ధి చెందలన్నారు అన్నారు స్త్రీ శక్తి ఎంటర్ ప్రైజెస్ ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా వచ్చినటువంటి ఎస్సి ఎస్ టి రాష్ట్ర నాయకుడు పి ఆర్ నెల్సన్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం లో మల్లారం మండల మహిళా అధ్యక్షురాలు పంతకాని చంద్రకళ,పీక కిరణ్, ఏకు సతీష్ ములుగు ప్రేమ్ కుమార్ మంథని రాజు విజయ్ విశాల్ సందీప్ మడిపెల్లి దేవేందర్ అధిక సంఖ్యలో యువతి యువకులు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.