మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..
మహిళలు సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి…..
అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలనీ అంజనేపుత్ర రియల్ సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రం లోని చున్నం బట్టి వాడలో ఆ సంస్థ కార్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ అమ్మగా, ఆలిగా,ఆలిగా పోరాట జ్వాలవై, ఆశయాల బాటవై, ఈసృష్టికి మూలమై, మానవుడి మనుగడకు ప్రాణమై, అన్నిట్ల సగభాగమై, ఆదేరువై, ఆధరణై, అనునిత్యం అండగా ఉంటున్న ఆడబిడ్డలందరూ అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంజనీ పుత్ర సంస్థ డైరెక్టర్ లు మహిళలు తదితరులు పాల్గొన్నారు