చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం కట్ట లింగంపేట గ్రామానికి చెందిన 30 మంది మహిళలు శనివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గెలిచిన సందర్భంగా 30 మంది మహిళలు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చేరుకొని రాజన్నకు మొక్కులు చెల్లించి అభిమానాన్ని చాటుకున్నారు. ఆది శ్రీనివాస్ ఎప్పుడైనా ఎల్లవేళలా అందుబాటులో ఉండే నిస్వార్థ సేవకుడని ఇంటి మనిషిగా మన్ననలు పొందాలని ప్రతి ఒక్కరికి ఆపద్బాంధవుడనే నమ్మకంతో , ప్రతి ఒక్కరికి ఇంటి మనిషిలా ఉంటున్న గొప్ప నాయకుడు ఉంటూ మన సమస్యలు తెలిసిన వాడు గెలుపొందిన కోరిక నెరవేరింది. మొక్కులు చెల్లించుటకు పాదయాత్రగా పరమేశ్వరునికి దర్శనం చేసుకున్నామని అన్నారు.
ఆది శీనన్న పై అభిమానంతో రాజన్న సన్నిధికి మహిళల పాదయాత్ర.
