లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి:
మండలంలోని చెల్లంపేట గ్రామానికి చెందిన జైనేని భీమక్క అనే 35సంవత్సరాల మహిళ ఆదివారం మధ్యాహ్నం తాగిన మైకంలో భర్తతో గొడవపడి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించింది. మృతురాలి అదే గ్రామానికి చెందిన జైనేని రవి తో 20సంవత్సరాల క్రితం వివాహం కాగా పిల్లలు పుట్టలేదు. ఇద్దరు కూలి పని చేసుకొని బ్రతుకుతారు. ఇద్దరు రోజు అతిగా మద్యం సేవించి గోడవపడుతారని మృతురాలు తాగిన మైకంలో భర్తపై చేయి చేసుకుంటుందని స్థానికులు కుటుంబీకులు చెప్పారు. అదే క్రమంలో ఆదివారం ఉదయం నుండే ఇద్దరు తప్పతాగి గోడవపడటంతో పాటు మృతురాలు తన భర్తను కొట్టి రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మృతుని తమ్ముడు చేదం రాజన్న పిర్యాదు మేరకు ఎస్సై-2 రామయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.