
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి :
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడేజహంగీర్ ను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం రోజునచండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ సమావేశం సిపిఎం సీనియర్ నాయకులు అంతిరెడ్డి అధ్యక్షతనసమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జహంగీర్ ను ప్రజలు ఆదరించిఅత్యధిక మెజార్టీతో, ప్రశ్నించే గొంతును, పార్లమెంటుకు పంపాలని ఆయన ప్రజలను కోరారు.విద్యార్థి దశ నుండి 35 సంవత్సరాలుగా ప్రజల మధ్యన ఉంటూ, ప్రజల పక్షాననిస్వార్ధంగా నిలిచి,అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టి, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేసి, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండి పోరాడే వారని అన్నారు. సాగునీరు అందించే పాలమూరు- రంగారెడ్డి, ఎస్ ఎల్ బి సి, ఉదయ సముద్రం, బస్వపురం, గంధ మల్ల దేవాదుల, ప్రాజెక్టులు పూర్తి చేయాలని, విద్య, వైద్యం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై, పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఆయనకు, సి పి ఐ (ఎం )కు ఉందన్నారు. ఈ నియోజకవర్గం లో, భిన్న పార్టీలఅభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ, వారు స్వార్థ ప్రయోజనాల తప్ప, ప్రజా సమస్యలపై పోరాడిన చరిత్ర లేదని, డబ్బులతో ప్రజలను తప్పుతోవ పట్టించి ఎన్నికల్లో గెలవాలనే, ప్రయత్నం చేస్తున్నారనిఆయన అన్నారు. ప్రజలు వాస్తవాన్ని గ్రహించి, ఐదేండ్లుమన భవిష్యత్తును నిర్ణయించే ఓటును, ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండిజహంగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలనుకోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి మోగుదాల వెంకటేశం, మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, ఈరటి వెంకన్న, బుర్కల అంజయ్య గౌడ్, స్వామి, నారపాక శంకర్, కొత్తపల్లి లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.