Will Jharasangam Bus Stand Get a Revival?
బస్టాండుకు మోక్షం కలిగేనా…..?
“◆-: ఇబ్బందుల్లో ప్రయాణీకులు
“◆-: కన్నెత్తి చూడని ఆర్టీసీ అధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు అస్తవ్యస్తంగా వయారైంది. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అప్పటి ప్రజాప్రతిని ధులు, అధికారులు బస్టాండ్ నిర్మాణానికి పూనుకున్నారు. 1991 మార్చి 28న అప్పటి మంత్రి సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. ఈ బస్టాండు నిర్మాణం పూర్తి చేసు కున్న తర్వాత ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. 1997 జూన్ నెలలో అప్పటి ఎమ్మెల్యే జంగల్ బాగన్న మెదక్ ఎంపీ స్వర్గీయ బాగారెడ్డి చేతుల మీదుగా ఆర్టీసీ బస్టాండ్ సు ప్రారంభించారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజా ప్రతినిధులు అలసత్వం వల్ల బస్టాండు పూర్తిగా వాడుకలోకి రాలేదు. దీంతో బస్సులు బస్టాండ్లోకి రాకుండానే నేరుగా ఝురాసంగంలోని చౌరస్తా వద్ద బస్సులు

ఆటోలు నిలుపుతున్నారు.ఆర్టీసీ బస్టాండు ఉన్నప్పటికీ ఐస్టాండ్లోకి ప్రయాణికులు రాకపో వడంతో చౌరస్తా నుండే ప్రయాణీకులను తీసుకెళ్తున్నారు. బస్టాండ్ లో సరైన సదుపా యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. బస్టాండ్ లో రెండు దురాణాలు, మరుగుదొడ్లు, బస్సులు నిలిచేందుకు స్టేజీలు, దాంతోపాటు కూర్చు నేందుకు దిమ్మెలు కూడా ఏర్పాటు చేశారు. బస్టాండ్ లోకి బస్సులు వెళ్లకపోవడం, ఆర్టిసీ అధికారులు బస్టాండ్ వైపు కన్నెత్తి చూడకపో వడంతో బస్టాండ్ లోని రెండు దుకాణాల షటర్లు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు.

వీటితోపాటు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన దిమ్మెలతో పాటు ఫోరింగ్ కు వేసిన శాబాద్ బండలను సైతం తీసుకెళ్ళారు. అయినప్పటికీ ఆర్టిసీ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించ డంతో బస్టాండ్ పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో పేరుకుపోయింది. గీత రెండు సంవత్సరాల క్రితం బస్టాండ్ ముందు ప్రైవేటు వ్యక్తులకు సిమెంటు స్తంబాలు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ అధి కారులు లీజుకి ఇచ్చినప్పటికీ బస్టాండ్ మాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. చౌరస్తా వద్ద దుకాణాల సముదా యాలు ఉండడం వల్ల బస్సులు, ఆటోలు ఆపడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుకుంది
ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం,
ఝరాసంగం బస్టాండ్ నిర్వహణ పై
జహీరాబాద్ డిపో మేనేజర్ స్వామి మాట్లాడుతూ గత నెల రోజుల క్రితమే మహా శివరాత్రి పర్వదినం రోజున బస్టాండ్ ను శుభ్రం చేశామని, అక్కడికి బస్సులు వచ్చి పోతున్నాయని చెప్పడం గమనార్హం. బస్టాండ్ లోని రెండు దురా ణాల సముదాయాలకు సంబంధించి షట్టర్లు లేవని ఆడగగా తాము ఎప్పటిక ప్పుడు బస్టాండ్ ను పరిశీలిస్తున్నట్లు. తమతో పాటు తమ సిబ్బంది కూడా బస్టాండ్ పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
-స్వామి, ఆర్టీసీ మేనేజర్
