ఆ” అధికారి” ఎందుకు వచ్చినట్లు.!
టి జి ఎం డి సి నిర్లక్ష్యం, హద్దులు దాటుతున్న ఇసుక అక్రమాలు.
ఆ అధికారి వచ్చి ఏమి చేసినట్లు, గుట్టు చప్పుడు కాకుండా వచ్చుడు ఎందుకు.
మంచిర్యాల జిల్లా క్వారీ, కుంట్లం ఇసుక తీస్తుంటే ఆ అధికారికి కనబడలేదా.
దేవుని దర్శనంగా అధికారుల సందర్శన, రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతున్న అక్రమాలు.
టీజీఎండిసి చీకటి ఒప్పందమే, ఇసుక క్వారీల అక్రమాలు,
అనేక సాక్షాలు తెరపై.
ఇప్పటికే ఐదు క్వారీల్లో అక్రమ వసూళ్ల పర్వం, కొత్తగా తెరపైకి పక్క జిల్లా క్వారీకి ఇసుక రవాణా ఆగేనా.
మహాదేవపూర్- నేటి ధాత్రి:
ఇసుక క్వారీల్లో అక్రమాలకు అంతులేకుండా యదేచ్చగా అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక బిసి కాసులు దండుకుంటున్న క్రమంలో, మండలంలోని 5 ఇసుక క్వారీల అక్రమ వ్యవహారం, తెరపైకి వస్తున్న క్రమంలో అధికారుల చర్యలు లేకపోవడం, ఇసుక రీచ్ లో అక్రమాలకు మరింత బలం చేకూర్చింది, ఒకవైపు ఇప్పటికే పలుకుల 8 పలువుల తొమ్మిది, మహాదేవపూర్ పూసుక్ పల్లి,1 పుసుపల్లి పలుకుల సిక్స్, పుసుపల్లి ఒకటి. ఐదు ఇసుక రీచ్ లో దర్జాగా దోపిడీ వ్యవహారాన్ని, సాక్షాలతో తెరపైకి తీసుకువచ్చిన, టీజీఎండిసి అధికారులు చర్యలకు ఉసేత్తలేదు, ఉన్నత అధికారుల నిర్లక్ష్యం ఇసుక రీచ్ లో దోపిడీ అక్రమ ఇసుక రవాణా చేస్తూ మరింత రెట్టింపు ఉత్సాహంతో, ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు దర్జాగా వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం తెరపైకి వచ్చింది, మంచిర్యాల జిల్లా చెన్నూర్ సరిహద్దుకు అనుకొని ఉన్న ఎర్రాయిపేట తీరుతూ నిర్వహించబడి ఇసుక క్వారీ గోదావరిలో అక్రమ రోడ్డును నిర్మించి, కుంట్లం గ్రామ శివారు నుండి ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. ఇది కూడా టీజీఎండిసి నిబంధనలకు విరుద్ధం కాదు, స్థానికులు అడిగితే అధికారులు టీజీఎండిసి విధానాల పాఠాలను చెప్పడం, కాంట్రాక్టర్ సూపర్వైజర్ కు అడిగే పరిస్థితి లేదని, అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా తరలించడమే కాకుండా దౌర్జన్యాo, బెదిరించే పరిస్థితికి దారితీసింది. తాజాగా మరోవైపు “సెన్సేషనల్” విషయం గుట్టు చప్పుడు కాకుండా రెండు రోజులుగా మండలమంతా గుసగుసలాడింది, అదేమిటంటే ఉన్నత అధికారి సందర్శన, వింటే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా కానీ అదే నిజం.

ఆ అధికారి ఎందుకు వచ్చినట్లు.!
రాష్ట్రవ్యాప్తంగా మహాదేవపూర్ ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్లు పాసింగ్ పై అదనపు ఇసుక రవాణా, పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల వసూళ్ల పర్వం, గత 24 గు రోజుల నుండి, వరుస కథనాలు తెరపైకి వస్తున్న క్రమంలో, టీజీఎండిసి సిబ్బంది, తమ హద్దులు దాటి వసూళ్ల పర్వం కొనసాగిస్తున్న సాక్షాలు, లోడింగ్ పై అదనపు ఇసుక తరలిస్తున్న లారీలు కాంటాల వ్యవహారం, సాక్షాలతో తెరపైకి తీసుకురావడం తోపాటు మండలంలో ఇసుక రీచుల అక్రమ వసూళ్ల వ్యవహారం, లక్షల రూపాయల సొమ్ము కాంట్రాక్టర్లు జీబులు నింపుకోవడం, వారికి గుమస్తాలుగా టీజీఎండిసి సిబ్బంది సహకరించడం లాంటి విషయాలను సాక్షాలతో తెరపైకి తీసుకురావడంతో పాటు, టీజీఎండిసి అధికారుల నిర్లక్ష్యం, చర్యలకు ససి మీరా అనడం, వరుస కథనాలతో అధికారులు చలనం రాకపోవడం తో కాంట్రాక్టర్లు తమ అక్రమాలను మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగడం లాంటి విషయాలను, తిరుపతికి తీసుకురావమే, లక్ష్యంగా అడుగులు వేస్తున్న క్రమంలో, శనివారం రోజు ఉన్నత అధికారి గుర్తు చప్పుడు కాకుండా, మండలంలో నిర్వహించబడుతున్న కొన్ని ఇసుక క్వారీల వద్ద సందర్శించడం జరిగిందని తెలుస్తుంది.

వచ్చిన ఆ అధికారి లారీల డ్రైవర్ లను ఏమైనా ప్రశ్నించడం జరిగిందా, కాంటాల వద్ద “రీబూట్” చేసి చూడడం లాంటి జరిగిందా, అంటే అలాంటిది ఏమీ లేదు, మరి ఆ అధికారి ఎందుకు వచ్చినట్లు, అంత పెద్ద అధికారి వస్తే ఎవరికైనా సమాచారం ఇవ్వాలి కదా, అలాంటిది ఏమీ జరగలేదు, ఆ ఉన్నత అధికారి వచ్చి వెళ్లడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. కానీ ఆ అధికారి పర్యటన వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉందని మాత్రం చర్చలు జరుగుతున్నాయి.

టి జి ఎం డి సి, నిర్లక్ష్యం, హద్దులు దాటుతున్న ఇసుక అక్రమాలు.
ఇక టీజీఎండిసి నిర్లక్ష్యం మండలంలో నిర్వహించబడుతున్న క్వారీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయని పరిస్థితి కొనసాగుతుంటే, మరోవైపు పక్క జిల్లా క్వారీలు కూడా, గోదావరి సరిహద్దుకు ఆనుకొని ఉన్నాము కదా, “ఆ ఇసుక, ఈ ఇసుక” అంతా ఒకటే, అనుకున్నారేమో వారం రోజులుగా గోదావరిలో రోడ్డు నిర్మించి, పెద్ద మొత్తంలో కుంట్లం సరిహద్దు నుండి ఇసుక రవాణా చేస్తుంటే, జిల్లా టీజీఎండిసి మైనింగ్ తో పాటు శనివారం వచ్చిన ఆ ఉన్నత అధికారికి, స్థానిక అధికారులు చూపెట్టారో లేదో, కానీ పాపం పక్క జిల్లా ఎర్రాయిపేట క్వారీ కాంట్రాక్టర్ మాత్రం, గోదావరిలో అక్రమ రోడ్డు నిర్మించి, దర్జాగా నేను కూడా టీజిఎండిసి ఇసుక కాంట్రాక్టర్ నే కదా అని కుంట్లం సరిహద్దు ఇసుకను ఎర్రాయిపేట క్వారీ వద్ద రవాణా చేసుకుంటున్నాడు, ఈ వ్యవహారాన్ని చూస్తే శభాష్ టీజీఎండిసి అనాలనిపిస్తుంది ఆట గ్రామస్తులకు, ఎందుకంటే గతంలో పలువుల 8 పేరుతో నిర్వహించబడిన ఇసుక క్వారీ, కేవలం రోడ్డు కొరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు సరిహద్దు గోదావరి ఇసుకను తీస్తుంటే, కాంట్రాక్టర్ టి ఎస్ జి డి సి పి ఓ గతంలో చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు టీజీఎండిసి రూల్ మారిపోయింది. మండలంలో నిర్వహించబడుతున్న ఇసుక క్వారీలో అక్రమాలు సాక్షాలతో తెరపైకి తీసుకువచ్చిన చర్యలు తీసుకొని టీజీఎండిసి, ఇక పక్క జిల్లా వారు వచ్చి అక్రమంగా దోచుకుంటే ఇలా ఆపుతుంది అని చెప్పుకొస్తున్నారు కులం గ్రామస్తులు.

ఆ అధికారి వచ్చి ఏమి చేసినట్లు, గుట్టు చప్పుడు కాకుండా వచ్చుడు ఎందుకు.
ఇక ప్రస్తుతం మండలంలో గుట్టు చప్పుడు కాకుండా ఉన్నత అధికారి పర్యటన కాస్త చర్చగా మారింది, మండలంలో భారీగా అక్రమ వసూళ్లు నిర్వహిస్తున్న ఐదు ఇసుక రీచ్ లో, పూసుకుపల్లి ఒకటి తమ క్వాంటిటీని అక్రమ వసూళ్ల పర్వంతో సమాప్తం చేసుకొని దుకాణం లేపేసింది, కానీ టీజీఎండిసీ, కమిట్మెంట్ తప్ప ఏమీ చేయలేకపోయింది. అలాగే కాలేశ్వరం గ్రామానికి ఆనుకొని నిర్వహించబడుతున్న పుసుపల్లి పలుకుల సిక్స్ కూడా గత రెండు రోజులుగా లోడింగ్ నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం పలువుల 8 పలువుల తొమ్మిది మహాదేవపూర్ పూసుకుపల్లి ఒకటి, అక్రమ వసూళ్లలో తగ్గేదే లేదని మరింత రెట్టింపు ఉత్సాహంతో రోజుకు 80 నుండి 100కు పైచిలుకు లారీల్లో ఇసుక రవాణా చేస్తుంటే, వచ్చిన ఉన్నత అధికారి ఈ క్వారీ ల వద్ద వెళ్లి ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా, అంటే అలాంటిది ఏమీ లేదు ఉన్నత అధికారి వచ్చిందంటే, కింది స్థాయి అధికారి నుండి కాంట్రాక్టర్ ల వరకు భయం గుప్పిట్లో ఉంటుంది కానీ ఇక్కడ అంత సీన్ లేదు ఆటా, ఎందుకో మరి, దేవుని దర్శనముగా ఉన్నత అధికారులు ఇసుక క్వారీలకు సందర్శిస్తే, ప్రసాదం దొరుకుతుంది, కానీ అక్రమార్కులకు భయం ఎందుకు కలుగుతుంది, కానీ ఆ ముక్తిశ్వరుని పాపం మాత్రం కలుగుతుందని అంటున్నారు ఆ లారీ డ్రైవర్లు ఓనర్లు.
ఇప్పటికే” ఐదు “క్వారీల్లో అక్రమ వసూళ్ల పర్వం, కొత్తగా తెరపైకి పక్క జిల్లా క్వారీకి ఇసుక రవాణా ఆగేనా.
గుర్తుచప్పుడు కాకుండా ఉన్నత అధికారి ఇసుక రీచులకు సందర్శించినప్పుడు,మంచిర్యాల జిల్లా కు సంబంధించిన ఎర్రయ్య పేట పేరుతో నిర్వహించబడే క్వారీ, కుంట్లం ఇసుక తీస్తుంటే ఆ అధికారి దృష్టికి కిందిస్థాయి అధికారులు ఎందుకు తీసుకపోలేదు, లేకుంటే కావాలని చూసి చూడనట్టుగా వివరించారా ఇలా అనేక అనుమానాలు తెరపైకి రావడం జరుగుతుంది. అక్రమాలపై సాక్షాలతో తెరపైకి వస్తున్న క్రమంలో చర్యలకు బదులు దేవుని దర్శనంగా అధికారుల ఇసుక క్వారీలు సందర్శిస్తే, కాంట్రాక్టర్లు అధికారుల సందర్శనలు లెక్కచేయకుండా రెట్టింపు ఉత్సాహంతో అక్రమ వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా మండలంలో నిర్వహించబడుతున్న ఇసుక క్వారీల్లో అక్రమాలకు పురుడు పూసింది టీజీఎండిసి,ఏ అని చెప్పడంలో సందేహం లేదు, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా, కాంట్రాక్టర్లతో టీజీఎండిసి చీకటి ఒప్పందమే, దర్జాగా అనేక అక్రమాలు అక్రమ వసూలు అయినా అధికారుల నిశ్శబ్దం, ఇదే పెద్ద సాక్ష్యం, 24 రోజుల్లో 14 సంచలన కథనాలు సాక్షాలతో తెరపైకి వచ్చిన ఒక్క క్వారీని కూడా టీజీఎండిసి సీజ్ చేయలేదు, అంటే అక్రమ ఇసుక రవాణాపై, ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ఇక్కడ అమలవుతుంది. అంతేకాకుండా పక్క జిల్లాలకు కేటాయించిన ఇసుక క్వారీల ల్యాండ్ మార్కులను కూడా, కాంట్రాక్టర్లు వదిలిపెట్టి గోదావరి హద్దు దాటి అక్రమ రోడ్ల నిర్మాణాలు, చేపట్టి గోదావరి అవుతలి వైపు నుండి ఇసుక తరలిస్తుంటే టీజీఎండిసి చర్యలకు బదులు గుట్టు చప్పుడు కాకుండా, ఉన్నత అధికారులను దేవుని దర్శనంగా ఇసుక రీచులకు సందర్శనకు పంపిస్తుంటే అక్రమాలు ప్రభుత్వ సెండ్ పాలసీ విధానం ఎక్కడ అమలు అవుతుంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు మండలంలో ఇసుక క్వారీల అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.