ఎటూ పోయావు వానమ్మా…
రైతన్నలు ఆకాశం వైపు ఎదురుచూపు
శాయంపేట నేటిధాత్రి:
జూన్ మాసం వచ్చి 14 రోజులు గడిచిన తొలకరి పలకరించలేదు ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమైన రైతు వర్షం కోసం రోజు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు వరుణుడు కరుణించక పోవడంతో వానకాలం పంట సీజన్ ఆరంభంలో నిరాశ చెందుతున్నారు ప్రకృతి విపత్తుల నేపథ్యంలో పంటలు దెబ్బ తినడంతో రైతులు నష్ట పోవలసిన పరిస్థితి వస్తుంది ఒక నెల ముందుగానే ప్రారం భించాలని దిశా నిర్దేశం చేసింది. చినుకులు లేకపోవ డంతో విత్తనాలు విత్తుకుంటే అధిక దిగులు వస్తాయని రైతులు ఆలోచించారు ఎప్పటిలాగే రైతులు వానా కాలంలో వ్యవసాయ పనులు చేసుకునే పరిస్థితి కూడా లేక పోయింది వరుణుడు మొఖం చాటేసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ నెలలో విత్తనాలు వేసుకుంటే రైతన్నలకు వాన కాలంలో అనావృష్టి వెంటాడుతుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాకే నల్ల రేగడిలో 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మండలంలో పలు గ్రామాల్లో రైతులు వర్షం వస్తుందని నమ్మకంతో పత్తి విత్తనాలు నాటి ఎదురుచూస్తున్నారు ఈసారి ఎండతీవ్రత విపరీ తంగా ఉండడంతో మండలం లోని చెరువులు, కుంటలలో నీళ్లు లేక వెలవెలబోతు న్నాయి ఆయకట్టు వనరులు ఉన్న ప్రాంతాలలో ఆయకట్టు రైతులు కూడా వరుణుడు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎదురుచూస్తున్నాం..
మండలం రైతు ముసికే అశోక్
వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నాం సీజన్ లో వర్షాలు రాకుండా కష్టపడి పండించిన తర్వాత లేదా పంటలు చేతికి కొచ్చే సమయంలో వర్షాలు వచ్చి మమ్మల్ని నష్టం పరు స్తుంది ఈ వర్షాకాలంలో మొదట్లోనే వర్షాలు రాక కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది
వర్షాలు వచ్చిన తర్వాతనే విత్తనాలు వేయాలి
మండల వ్యవసాయ అధికారి గంగాజమున
వర్షాలు వచ్చిన తర్వాత విత్తనాలు వేయాలి ముం దస్తుగా విత్తనాలు వేసి రైతులు నష్టపోవద్దు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఈ విషయాన్ని ప్రచారం చేశాo.రైతులు అప్రమత్తంగా ఉండాలి.