వార్డ్ అసిస్టెంట్ పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్

మందమర్రి, నేటిధాత్రి:-

సింగరేణి వ్యాప్తంగా ఏరియా ఆసుపత్రిలో, డిస్పెన్సరీలో సిబ్బంది కొరత తీర్చడానికి నిర్వహించిన వార్డ్ అసిస్టెంట్ పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకట్ స్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్ లు సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, వార్డ్ అసిస్టెంట్ ట్రైనీలుగా ఎంపికైన సుమారు 150 మంది అంతర్గత ఉద్యోగులను వార్డ్ అసిస్టెంట్ ట్రైనీ లుగా నియమించి, వారందరికీ ఒక సంవత్సరం శిక్షణ ఇచ్చి, వారికి గత నెల ఆగస్టు 11న వార్డ్ అసిస్టెంట్ గ్రేడ్ హెచ్ పదోన్నతికి సంబంధించిన పరీక్ష సింగరేణి వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందన్నారు. పరీక్ష నిర్వహించి నెల రోజులు దాటిన యాజమాన్యం ఇప్పటివరకు ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేయకపోవడంతో పరీక్ష రాసిన అభ్యర్థులు తీవ్ర ఆందోళన గురి అవుతున్నారని తెలిపారు. పరీక్ష రాసిన ఉద్యోగులు తమకు రావాల్సిన గ్రేడ్ హెచ్ పర్మినెంట్ లెటర్ కోసం వేచి చూస్తున్నారన్నారు. పరీక్ష నిర్వహించిన అదే రోజు రాత్రి ఫలితాలు విడుదల చేసే సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు ఫలితాలు విడుదల చేయకుండా ఆలస్యం చేయడంతో పలు అనుమానాలు రేకెత్తే అవకాశం ఉన్నందున వెంటనే ఫలితాలు విడుదల చేసి, వారికి గ్రేడ్ హెచ్ పదోన్నతి పత్రాలు జారీ చేసి, వార్డ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్లకొండ ఐలయ్య, అలవాల సంజీవ్, జోరుక వెంకటేష్, సంకె వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!