నిజాంపేట్: నేటి దాత్రి ,మార్చి 22
నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో పాత బావులు ప్రమాదాన్ని తలపిస్తున్నాయి. ఈ మేరకు నస్కల్ గ్రామనికి చేరుకోవడంతో పాత బావి దర్శనమిస్తాది రోడ్డు పక్కనే ఉన్న ఈ పెద్దబావి వచ్చిపోయే వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. గ్రామానికి రాంపూర్ రోడ్ ఎంబడి మరో పాడుబడిన బావి మూలమలుపు ప్రాంతంలో ప్రమాదం కరంగా ఉంది. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే కంట్రోల్ కాక అదుపుతప్పి ఆ బావిలో పడే అవకాశం ఉన్నది. అదేవిధంగా గ్రామంలోని చర్చి ఏరియాలో గాజు బావి ఉన్నది పశువులకు చిన్నపిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. మరొక్క గాజు బావి ఇళ్లకు ఆనుకొని ఉన్నది ఇందులో కుక్కలు పందులు కోళ్లు పడి చనిపోయి వాటి దుర్వాసన ఇళ్లల్లోకి వ్యాపించి శ్వాస తీసుకోలేని స్థితిలో ఉంటుంది. ఈ నెల లో చిన్నపిల్లలు స్కూల్లో నుండి హాస్టల్లో నుండి ఇళ్లల్లోకి చేరుకుంటారు కాబట్టి ఆడుతూ పాడుతూ వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సంబంధిత అధికారులు ఈ పాడుబడిన బావులు సందర్శించి పూడ్చే విధంగా చర్యలు చేపడతారని ప్రజలు కోరుకుంటున్నారు.