Students Turn Teachers in Inspiring Self-Governance Event
విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ….
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గ్రామ మామిడ్గి స్వయం పాలన దినోత్సవం – ఘనంగా, విజయవంతంగా నిర్వహణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మామిడ్గిలో ఈ రోజు “స్వయం పాలన దినోత్సవం”ను ఎంతో ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రను స్వీకరించి తరగతులను నిర్వహిస్తూ తమ నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం మరియు క్రమశిక్షణను ప్రతిభావంతంగా ప్రదర్శించారు.
కార్యక్రమం ఉదయం ప్రార్థనతో ప్రారంభమై, విద్యార్థుల సమన్వయంతో సజావుగా కొనసాగింది. విద్యార్థి-ఉపాధ్యాయులు వివిధ తరగతుల్లో పాఠాలను బోధిస్తూ పాఠశాల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయురాలి స్థానాన్ని ఒక విద్యార్థి స్వీకరించి పాఠశాల కార్యకలాపాలను సమర్థవంతంగా సమన్వయం చేయడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు కలెక్టర్, డీఈవో, ఎంఈవో పాత్రలను స్వీకరించి తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి చంద్రకళ గారు మాట్లాడుతూ, “స్వయం పాలన దినోత్సవం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తులో నాయకులుగా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది” అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల కృషిని, సమర్పణను అభినందిస్తూ వారి భవిష్యత్తు విజయాల కోసం ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మొహమ్మద్ సమియుద్దిన్, గోవిందు, బాలకృష్ణ, దేవరకొండ నాన్సీ, కృష్ణ, రాజేశం, కృష్ణవేణి, రష్మీ తదితరులు పాల్గొని విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించారు. విద్యార్థులు మరియు సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.స్వయం పాలన దినోత్సవం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన, మరిచిపోలేని అనుభవంగా నిలిచింది.
