
Kohir Gram Panchayat.
కోహీర్ మున్సిపాలిటీలో మార్పేది?
◆: కొత్త మున్సిపాలిటీకి కమిషనర్ కరువు
◆: నెల నుంచి ఆగిన ఆన్లైన్ సేవలు
◆: అయోమయంలో పట్టణ ప్రజలు
◆: పట్టించుకొని అధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహీర్,గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ప్రకటించడంతో తమ సమస్యలు తీరుతాయని సంతోషపడిన పట్టణ ప్రజలకు నిరాశే మిగిలింది. కోహీర్ గ్రామ పంచాయతీలో 21వేలకు పైగా జనాభా ఉండడంతో ఈ సంవత్సరం జనవరి 27న మున్సిపాలిటీగా ప్రకటిం చారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, ఇతర అధి కారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని దీంతో తమ సమస్యలు తీరుతాయని అనుకున్న ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. జనవరి 28న ఉమామ హేశ్వర్రావు కోహీర్ పట్టణ తొలి మున్సి పల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిం చారు. కానీ ఆయన ఫిబ్రవరి 16 వరకు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించా రు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారా నికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయ కపోవడంతో మున్సిపల్ అధికారులు సహితం ఇబ్బందులు పడుతున్నారు. కొత్త మున్సిపాలిటీ అయిన ఐదు నెలల్లో నలుగురు కమిషనర్లు ఇక్కడకు వచ్చి చేసే దేమీలేక తిరిగి వెళ్లారు. ఉమామహేశ్వర్ రావు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 16 వరకు కోహీర్ కమిషనర్గా విధులు నిర్వహించారు. తర్వాత వెంకట్రెడ్డి మార్చి 18వ తేదీ వరకు కార్యాలయ విధులకు హాజరయ్యారు. ఆయన బదిలీ కావడంతో మున్సిపల్ కమిషనర్ రమేశ్ కుమార్ బాధ్యతలను చేప ట్టారు. కానీ అతడు కూడా మార్చి 4వ తేదీ వరకు మా త్రమే ఇక్కడ పని చేశారు. తాండూర్ వెళ్లిపోవడంతో కొత్త కమిషనర్ గా ప్రకాశ్ విధుల్లో చేరారు. అతడిని కూడా సీడీ ఎంఏ హైదరాబాద్ హెడ్ ఆఫీస్కు బదిలీ చేస్తున్నట్లు ఉత్త ర్వులు జారీ చేశారు. కొత్త కమిషనర్ వచ్చే వరకు లోనే విధులు నిర్వహించాలని మౌకికంగా సూచించారు. కానీ ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ఆయన మాత్రం జూన్ 4న దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో నెల గడిచినా కొత్త కమిషనరు నియమించలేదు. దీంతో పట్ట ణంలో ఎక్కడ చూసినా సమస్యలు దర్శనమిస్తున్నాయి. సీసీ రోడ్లపై మురుగు, రోడ్ల పక్కన చెత్త కనిపిస్తున్నది.
నిలిచిన ఆన్లైన్ సేవలు
కోహీర్ పట్టణ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వ హించిన ప్రకాశ్ జూన్ 4వ తేదీన హైదరాబాద్ కార్యాల యానికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఒక్క ఆన్లైన్ పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొత్త కమిషనర్ వస్తేనే అతడి కీ ద్వారానే కంప్యూటరీకరణ ప్రారంభమవుతుంది. కానీ పట్టణ ప్రజలు పత్రాల కోసం నిత్యం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా నిస్సా హయ స్థితిలో ఉన్నారు. వారు కేవలం పారిశుధ్యం, ఇంది