బంగారు వార్తలన్నీ గిల్టువేనా?

`మార్కెట్‌ మాయాజాలం… సామాన్యుడికి సుడిగుండం.

`జనాలను మోసం చేయడానికే!

`ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేయడమే?

`గత ఆరు నెలల్లో విపరీతంగా పెంచేశారు.

`దసరా పండుగకు ముందు 75వేలు.

`దిగుమతుల సుంకాలను తగ్గించడంతో రూ.69 వేలకు వేరింది.

`ఆరు నెలల్లోనే మళ్ళీ 90 వేలకు ఎందుకు చేరింది?

`విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా ఆపాలని సుంకం తగ్గించారు.

`మరింతగా ధర తగ్గనైనా తగ్గాలి.

`బంగారం ధరలు స్థిరంగానైనా వుండాలి.

`అమెరికా దిగుమతి సుంకాలు పెంచడంతో బంగారం ధర తగ్గుతోందనేది నిజమా?

`మనమే టన్నుల కొద్ది బంగారం దిగుమతి చేసుకుంటున్నాం.

`మన దేశం నుంచి అమెరికాకు బంగారం ఎగుమతి చేస్తున్నామా?

`ఈ లెక్కలు నమ్మశక్యంగా వున్నాయా?

`పావలా తగ్గించి రూపాయి పెంచడం అలవాటు చేసుకున్నారు.

`ధరల నియంత్రణ ప్రభుత్వం వదిలేయడంతో ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి.

`2000 సంవత్సరంలో బంగారం తులం ధర. రూ. 4 వేలు.

`2015 వరకు పదిహేళ్లలో పెరిగిన ధర రూ. 24 వేలు.

`ఈ పదేళ్లలో చేరిన ధర సుమారు రూ. 90 వేలు.

`పదేళ్లలో బంగారం ధర ఎందుకు ఇంత పెరుగింది!

`సామాన్యలకు అందకుండా ఎందుకు పైపైకి వెళ్తోంది.

`ప్రజలలో కొనుగోలు శక్తి లేనప్పుడు ధరలు తగ్గాలి.

`ఎగుమతులు చేసేంత బంగారం మన వద్ద వుంటే మనకు చౌకగా దొరకాలి.

`ఏది నిజం.. ఏది అబద్దం!?

మెరిసేదంతా బంగారం కాదు..బంగారం ధరలు దిగివస్తున్నాయ్న వార్తలో నిజం అసలే లేదు. వ్యాపారులు ఆడుతున్న నాటకాలు. జనం జేబులకు చిల్లు పెట్టే కుట్రలు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు వేస్తున్న ఎత్తులు. ఎందుకంటే గతంలో బంగారం కొనుగోలు, వస్తువుల తయారి అనేది వృత్తిగా మాత్రమేవుండేది. ఇప్పుడు అది వ్యాపారమైపోయింది. వేల కోట్లు పెట్టుబడి పెట్టి, షాపులు ఏర్పాటు చేస్తున్నారు. వాటి నిర్వహణ, లాబాలు ఎప్పటికిప్పుడు రావాలి. ఆ షాపుల్లో పనిచేసే లక్షలాది మందికి జీతాలు చెల్లించాలి. ఇలా ప్రభుత్వాలకు పన్నులు చెల్లించాలి. ఇదంతా జనం మీద మాత్రమే రుద్దాలి. ఇదీ బంగారం మార్కెట్‌ చరిత్ర. బట్టల షాపులో పనిచేసే వ్యక్తికి, బంగారం షాపులో పనిచేసే కార్మికుడికి ఒకే రకమైన జీతం వుంటుంది. బట్టల వ్యాపారం చేసే వారికి వచ్చే లాభాలకు, బంగారు వ్యాపారులకు వచ్చే లాభాలకు చాలా తేడా వుంటుంది. ఒక నగరంలో వేలాది బట్టల దుకాణాలుంటాయి. కాని బంగారం దునాలు పదులు సంఖ్యలోనే వుంటాయి. కాని బంగారం వ్యాపారం బంగారమే..కాని జనం కొంటేనే అది నిజమైన బంగారం వ్యాపారం. సహజంగా ధర పెరిగిందంటే ప్రజల వద్ద కొనుగోలు శక్తి తగ్గుతుంది. వారి కోరికలను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటుంటారు. ధర తగ్గకపోతుందా? అని ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి కోసం అప్పుడప్పుడు బంగారు వ్యాపారులు ఇలాంటి వార్తలు సృష్టిస్తారు. పావలా తగ్గించి, బంగారం ధరలు ఢమాల్‌ అని ప్రచారం సాగిస్తుంటారు. కాని బంగారం ధరలు పెరిగినప్పుడు మాత్రం స్పల్ప పెరుగుదల అని వార్తలు రాయిస్తారు. తగ్గినప్పుడు పసిడి ప్రియులకు గుడ్‌ న్యూస్‌ అంటారు. బంగారు వార్తలన్నీ గిల్టువే..జనాలను మోసం చేయడానికి వేస్తున్న ఎత్తులే.. ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేయడమే. ఆరు నెలల్లో బంగారం ధర విపరీతంగా ఎందుకు పెరిగింది. అంతగా డిమాండ్‌ ఏర్పడితే పెంచారా లేక, మార్కెట్లు పెంచుకునేందుకు లేని లెక్కలు చూపించారా? సగటు వ్యక్తి రోజు తినడానికే సంపాదించింది చాలడం లేదు. రోజంతా కష్టం చేసినా వెయ్యి రూపాయలు రావడం లేదు. పట్టణ ప్రజల జీవితాలు మరీ దుర్భరంగా మారుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌ అంటే లివింగ్‌ కాస్ట్‌ చాలా తక్కువ అనే పేరుండేది. ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో నుంచి వెళ్లే వారు ఎవరూ హైదరాబాద్‌లో బతికే పరిస్దితి లేదు. చేసే పనులకు తగిన ప్రతిఫలం దక్కడం లేదు. నివాసముందామంటే అందుబాటులో ఇళ్ల కిరాయలు లేవు. పూట ఎట్లా గడుస్తుందిరా దేవుడా? అని బాధపడే సగటు వ్యక్తికి బంగారం ఆకాశమంత ఎత్తుగా కనిపిస్తుంది. అలాంటి బంగారాన్ని అందుకోవాలన్న ఆశ కూడా ఎప్పుడో చంపుకున్నారు. సగటు ఉద్యోగులు కూడా బంగారం కొనుగోలు చేసే శక్తిలో లేరు. మరి ఎవరు కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు? ఇదంతా మార్కెట్‌ మాయాజాలం అంతే..మొన్నటి వరకు బంగారం ధరలు రాకెట్లలా దూసుకుపోయాయి. సరిగ్గా గత దసరా పండుగ సమయంలో తులం 24 క్యారెట్‌ బంగారం ధర రూ.43వేల వరకు వుంది. అదే సమయంలో దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం జరిగింది. దాంతో ఒక్కసారిగా తులం బంగారం ధర రూ.5వేలకు వరకు పడిపోయింది. దానిని కూడా గొప్పగా ప్రచారం చేసుకున్నారు. జనాన్ని నమ్మించారు. ఆలోచించినా ఆశాభంగం అన్నట్లు ప్రచారం సాగించారు. ఒక రకంగా చెప్పాలంటే జనం ఎగబడి కొన్నారు. అంటే వారిలో కొనుగోలు శక్తి వుండి కాదు. సామాన్యుడికి రూ.5వేల ధర తగ్గడం అంటే ఎంతో ఊరట చెందే అంశం. అలా కొంత కాలం కాగానే బంగారం ధర పైపైకి ఎగబాకింది. రూ.90వేలు దాటింది. ఇలా బంగారం ధరలను రూపాయి పెంచడం, పావలా తగ్గించడం జనాన్ని నమ్మించి ముంచడం తప్ప బంగారం వ్యాపారంలో నిజాయితీ లేదు. ఇకతాజాగా అమెరికా సుంకాలను పెంచడం మూలంగా మనదేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయని ప్రచారం సాగిస్తున్నారు. ఏటా మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే బంగారం మనదేశంలోనే అమ్ముకుంటేనే మేలు అని వ్యాపారులు జనం మీద దయతలిచి తగ్గించారని ఓ రకమైన ప్రచారం. అసలు మనదేశమే గత ఏడాది లండన్‌ నుంచి సుమారు 400 కోట్ల టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మన అవసరాలు తీరేందుకే ఆ బంగారాన్ని కేంద్ర ప్రభుత్వం తెప్పించింది. మరి మన దేశ అవసరాలకే సరిపోకుండా వుంటే, అమెరికాలకు ఎలా ఎగుమతి చేస్తున్నట్లు? ఎందుకు చేస్తున్నట్లు? అదే నిజమైనే తలె అమ్ముకొని చెప్పులు కొనుక్కొవడమే అవుతుంది. మనకు లండన్‌ నుంచి చౌకగా బంగారం అందితే మన దేశ ప్రజలకు అందించాల్సిన అవసరం వదిలేసి, విదేశీ మారక ద్య్రవ్యంకోసం ఏ ప్రభుత్వమైనా చూస్తుందా? సహజంగా మనకు మిగులు వున్నప్పుడు, ఇతర దేశాలలో వారికి అందుబాటులో లేని వస్తువులను ఎగుమతులు చేస్తే విదేశీ మారక ద్రవ్యం సమృద్దిగా వస్తుంది. మనదేశం కంటే అమెరికాలోనే బంగారం చౌక. అలాంటిది అంతకన్నా చౌకగా అమెరికాకు ఎగుమతి చేస్తేనే ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. అంతే కాని మనదేశం చెప్పిన ధరకు అమెరికానే కాదు, ఏ దేశం కొనుగోలు చేయదు. ఇదంతా మార్కెట్‌ వర్గాలు ఆడుతున్న వింత నాటకం. గత దసరా సమయంలో రూ.75వేల వరకు పలికిన తులం బంగారం ఎందుకు రూ.90వేల వరకు చేరింది. ఆరునెలల సమయంలో ఇంతగా ధర పెరగడానికి, పెంచడానికి కారణం ఏమిటి? బంగారం వ్యాపారంలో జరుగుతున్న మోసాలపై ప్రభుత్వ నియంత్రణ లేకనా? లేక ప్రభుత్వ ఉదాసీనత? ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారుతోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచే ప్రయత్నాలు చేయాలి. వారికి అన్ని వస్తువులు అందుబాటులో వుండేలా విధానాలు రూపకల్పన చేయాలి. నిజం చెప్పాలంటే మనదేశంలో మధ్య తరగతి లేకుంటే దేశమే ఆగమౌతుంది. అలాంటి మధ్య తరగతిని వ్యాపారులు, ప్రభుత్వాలు చిదిమేస్తున్నాయి. జీవిత కాలం కోలుకోకుండా చేస్తున్నాయి. వారి పొదుపును ద్వంసం చేస్తున్నారు. రూపాయి రాక, పోకల మధ్య సున్నా బ్యాలెన్స్‌ కనిపించేలా చేస్తోంది. నెల గడవక ముందే అప్పుల పాలయ్యేలా ప్రభుత్వ విధనాలున్నాయి. గతంలో ఇలాంటి పరిస్ధితులు ఎప్పుడూ లేవు. ఎందుకంటే 2000 సంవత్సరంలో బంగారం ధర తులం. రూ.4000. అది ఏడాదికి కొంత పెరుగుతూపెరుగుతూ 2015వరకు రూ.25 వేలకు చేరింది. అంటే బంగారం ధరల్లో స్ధిరత్వమే కనిపించింది కాని, ఉద్దాన పతనాల ప్రభావం ప్రజల్లో పెద్దగా పడలేదు. కాని 2015 నుంచి 2025 వరకు ఆ ధర రూ.90 వేలకు చేరింది. అంటే పదేళ్లలో మూడు రెట్లు పెరిగింది. మరి ప్రజల జీతబత్యాలు పెరుగుతున్నాయా? వారి ఆదాయం పెరిగిందా? లేదు. కాని వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్నంటున్నాయి. అంతే కాకుండా జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ దోడిపీ మరింత పెరిగింది. దేశమంతా ఒకటే పన్ను విధానం అంటే ధరలు తగ్గుతాయని అందరూ ఆశించారు. కాని ఏం జరగింది. రివర్స్‌లో ధరలు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా ఆగడం లేదు. తగ్గడం లేదు. పెరగని జీతాలు, సంపాదనలతో పెరుగుతున్న ధరలను చూసి జనం విలవిలలాడుతున్నారు. ధరలు చూసి బేంబెలెత్తిపోతున్నారు. అయినా ప్రభుత్వాలు కనికరం చూపడం లేదు. ఇది ఒక్క బంగారానికే కాదు, అన్ని రకాల వస్తువుల ధరలు ఇలాగే ఆరోహన క్రమంలో ఎవరెస్టు శిఖరాన్ని తాకుతున్నాయి. అసలు ప్రజల్లో కొనుగోలు శక్తి లేనప్పుడు ఏ వస్తువు దరలైనా తగ్గాలి. లేకుంటే కొంత కాలం స్ధిరమైన ధరలే వుండాలి. డిమాండ్‌ అండ్‌ సప్లై అనే సూత్రం ఇక్కడ ఎక్కడా వర్తించడం లేదు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ హయాంలో బ్యాంకుల్లో వున్న బంగారం అమ్ముకున్న చరిత్ర వుంది. ఆప్పట్లో దీనిపై పెద్ద వివాదాలు కొనసాగాయి. అంటే ప్రపంచంలోని దేశాలైనా బంగారు బాండ్లను కొనసాగిస్తుంటాయి. టన్నుల కొద్ది బంగారం రిజర్వు బ్యాంకు కొనుగోలు చేసి, అత్యవసర ఆర్ధిక పరిస్ధితుల కోసం నిలువ చేస్తుంది. దేశంలో ద్రోవ్యోల్భనం పెరిగినప్పుడు దాని అసవరం వుంటుంది. కాని కరోనా కాలంలో ప్రపంచ దేశాలన్నీ దివాళా తీసినా, మనదేశంలో ద్రవ్యోల్భనం రాలేదు. ఆకలి కేకలు వినిపించలేదు. అంటే ఇన్ని కోట్ల జనాన్ని ప్రభుత్వాలు ఆదుకున్నాయి. అలాంటప్పుడు ఇలా కళ్లెం లేని గుర్రాల్లా ధరలు పెరిగిపోతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు. బంగారం ధరలు తగ్గుతాయన్న మాటలు నమ్మి, జనం ఎలా, ఎలా అని ఆలోచిస్తున్నారు. కాని నిజానికి బంగారం ధర ఒక్కసారి పెరిగిందంటే తగ్గడం అంటూ వుండదు. కాని హెచ్చు తగ్గుల్లో స్వల్ప తేడాలే గాని, ఉన్న ఫలంగా ధరలు తగ్గించేందుకు ప్రభుత్వాలు కూడా సానుకూలంగా వుండవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!