కాంగ్రెస్ ప్రభుత్వంలోనే.. పేదలకు సంక్షేమ పథకాలు
జడ్చర్ల /నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని హేమాజీపూర్ గ్రామంలో గురువారం.. ఏఐసీసీ ఆదేశాల మేరకు.. జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలో పాదయాత్రగా వెళ్లి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..
బూర్గుల గ్రామం నుండి హేమాజీపూర్ గ్రామానికి రూ. 1 కోటి 62 లక్షలతో బీటీ రోడ్డు మరమ్మత్తులు చేపడతామని, భవిష్యత్తులో డబుల్ బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
హేమాజీపూర్ గ్రామంలో అసంపూర్తిగా ఆగిపోయిన గ్రామపంచాయతీ, కమ్యూనిటీ హాల్, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం బిల్డింగ్ తండా, కోయిలకుంట తండా నేల బండ తండా, లింగారం, గాంధీ పాలెం తండాలలో పాదయాత్ర సాగింది.
గాంధీ పాలెంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.